Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జీడిమెట్ల
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో సూపర్ మ్యాక్స్ కంపెనీలో టీఎన్టీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్మికుల రిలే నిరాహార దీక్షకు సీఐటీ యూ జిల్లా నాయకులు కీలుకాని లక్ష్మణ్ మంగళ వారం మద్దతు తెలిపారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. జీడిమెట్ల పారి శ్రామిక వాడలో కర్మాగారాల యాజమాన్యాలు కార్మికులను ఎప్పుడూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సరైన వేతనాలు ఇవ్వకుండా కార్మికులను ముప్పుతిప్పలు పెడుతున్నారని అన్నారు. సూపర్ మాక్స్ కంపెనీలోనూ ఏండ్లుగా వేతన ఒప్పందాన్ని అమలు చేయడంలేదన్నారు. ఇలా కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం ఆయా యాజమాన్యాలకు తగదన్నారు. మంగళవారం దీక్షకు సీఐటీయూ నాయకులతో పాటు బీజేపీ నాయకులు బక్క శంకర్రెడ్డి, రఘుపతి , శ్రీనివాస్, తులసీ రంగారావు తదితరులు సంఘీభావం తెలిపారు. ఈకార్యక్రమంలో టీఎన్టీయూసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి, గుట్ట రాజు, భరద్వాజ్, రవికుమార్, రామచంద్రారెడ్డి, లకీëనారాయణ, సుజాత, సీత పాల్గొన్నారు.
బొమ్మా ఎల్లాగౌడ్ సంఘీభావం
సూపర్మాక్స్ కార్మికుల రిలే దీక్షకు తెలంగాణ ప్రయివేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు(కార్మిక విభాగం)బొమ్మా ఎల్లాగౌడ్ సంఘీ భావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వేతన సవరణ కోసం కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు తెలంగాణ ప్రయివేట్ ఉద్యోగుల సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. వారి సమస్యలను యాజమాన్యం పరిష్కరించే వరకు వెన్నంటే ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి, గుట్ట రాజు, భరద్వాజ్, రవికుమార్, రామచంద్రారెడ్డి, లకీëనారాయణ, సుజాత, సీత పాల్గొన్నారు.
కి