Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
తెలంగాణ రాష్ట్రం సుభిక్షం, క్రైస్తవుల అభివృద్ధి కోసం ఈనెల 21న మధ్యాహ్నాం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో 'ప్రేయర్ డే' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ డి.రాజేశ్వరరావు, క్రిస్టియన్ మీడియా కౌన్సిల్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రతినిధి బొజ్జా శ్యామూల్ తెలిపారు.మంగళవారం ఎల్బీస్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ రాజేశ్వరరావు పరిశీలిం చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి సిఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, తదితర హాజరుకానున్నట్టు తెలిపారు.