Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపరింటెండెంట్పై తప్పుడు ఆరోపణలు నవతెలంగాణ-సుల్తాన్బజార్
గాంధీ వైద్యశాల నర్సింగ్ సూప రింటెండెంట్ బి. మంగమ్మపై ఓ దినపత్రికలో చేసిన తప్పుడు ఆరోపణలను తెలంగాణ నర్సింగ్ సమితి రాష్ట్ర అధ్యక్షులు కురుమేటి గోవర్థన్ తీవ్రంగా ఖండించారు. ఇటీవల ఓ దిన పత్రికలో ఆమె ఫోటోలతో కొన్ని నిరాధార ఆరోపణలు చేశారని, ప్రభుత్వ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆమెపై ఇలాంటి ఆరోపణలు చేయడం దారుణమన్నారు. పవిత్ర నర్సింగ్ వృత్తిలో ఉన్న ఆమెను డాక్టర్గా చిత్రీకరిస్తూ, మత ప్రచారం చేస్తుందని తప్పుడు రాతలు రాశారని ఆరోపించారు. వైద్యశాలలో నర్సింగ్ సిబ్బంది నియామకాలు జరిపారని చెప్పడం బాధకరమన్నారు. ఈ విషయంపై వైద్య అధికారులు విచారణ చేపట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజాత రాథోడ్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరవృత్తం కాకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలన్నారు.