Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఈ నెల 17న నగరంలో నిర్వహించిన హరితహారం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు గోల్కొండ కోట సమీపంలో ఏర్పాటుచేసిన బ్యానర్ను ఫ్లెక్సీగా భావించి ట్విట్టర్లో ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుపై జిహెచ్ఎంసి ఈ.వి.డి.ఎం విభాగం స్పందించింది. ఫిర్యాదు అందిన వెంటనే పెనాల్టి చెల్లించాలని ఇ-ఛలానను జారీచేసింది. మంగళవారం సంబంధిత బ్యానర్ మెటీరియల్ను పరిశీలించి, ఫ్యాబ్రిక్ క్లాత్ మెటీరియల్గా నిర్థారణ చేసుకొని ఇ-ఛలానను తొలగించినట్టు జిహెచ్ఎంసి ఈ.వి.డి.ఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి ఓ ప్రకటనలో తెలిపారు.