Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
భాగ్యరెడ్డి వర్మ 81వ వర్థంతి సందర్భంగా దయార్ గూడ, అంబేద్కర్ పార్కులో, వార్డ్ మెంబెర్ మేకల నర్సింగ్ రావు పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సింగూరు పాండు, భాగ్యరెడ్డి వర్మ చేసిన సమాజ సేవలు, జోగీని, ఇతర మూఢనమ్మకాలపై ఎనలేని పోరాటం చేసి ప్రజలను చైతన్య పరిచాడని అన్నారు. లండన్ రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన అంబేద్కర్ ఒక్కడే భారత దేశ దళితుల ప్రతినిధి అని తెలిపారు. ముంబాయిలో మహాసభ నిర్వహించి తీర్మానించి లండన్కు పంపించి బ్రిటిష్ వారితో హక్కులు సాధించేటట్టు చేసిన మహానుభావుడని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గుణుగుంట యాదగిరి, పోతరాజు యాదయ్య, కాలెం శంకర్, బొట్టు విష్ణు, బచ్చలి శ్రీను, మహేందర్, బాలరాజ్ వినోద్, రమేష్ మహేష్ బాబు, చేగురి మహేశ్, అనంతనాగరాజు, శేఖర్ పాల్గొన్నారు.