Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని రంగారెడ్డినగర్ చౌరస్తాలో గల శివాజీ విగ్రహం వద్ద బుధవారం సాయంత్రం కుత్బుల్లాపూర్ ఛత్రపతి శివాజీ సేవ సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కుత్బుల్లాపూర్ ఛత్రపతి శివాజీ సేవ సమితి అధ్యక్షులు నందనం దివాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ బీసీ కమిషన్ మెంబర్ టి.ఆచారి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపూరి అరవింద్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పేరాల చంద్రశేఖర్జి, ఎమ్మెల్సీ రాంచందర్రావు, హెచ్ఎఎల్ డైరెక్టర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలిపారు. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.