Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉపాధి కల్పనకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని ఆవేదనతో బలవన్మరణానికి పాల్పడిన నరసయ్య మృతిపై టీిఆర్ఎస్ నేత, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని విద్యార్థి జన సమితి వీజేఎస్ రాష్ట్ర కో కన్వీనర్ సర్దార్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నరసయ్య కుటుంబాన్ని పరామర్శించకుండా, అనారోగ్యంతో మృతి చెందాడు అని మాట్లాడడం బాధాకరమన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారన్నారు.అది మరిచినా పిడమర్తి రవి నేడు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల మరణాలపై కూడా అబద్దపు ప్రకటనలు చేయడం బాధాకరమని న్నారు. ఇలాంటి ప్రకటనలు మానుకుని నరసయ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని, కుటుం బంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రవి దమ్ముంటే ఓయూకు రా.దయాకర్ : పిడమర్తి రవికి దమ్ముంటే ముఖ్యమంత్రితో మాట్లాడి నర్సయ్య కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని విద్యార్ధి నిరుద్యోగ ఫ్రంట్, పరిశోధక విద్యార్ధి, చనగాని దయాకర్ డిమాండ్ చేశారు.
శవ రాజకీయాలు చేయడం మానుకో : ఓయూలో సోమవారం ఆత్మహత్య చేసుకున్న జాగ్రఫీ విభాగం పరిశోధక విద్యార్థి డాక్టర్ కొంపల్లి నర్సయ్య అనా రోగ్యంతో చనిపోయాడంటూ పిడమర్తి రవి శవ రాజకీ యాలు చేస్తున్నారని ఎమ్ఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులు కొమ్ముశేఖర్ మాదిగ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పేరుతో వందల మంది విద్యార్థులు మరణించిరచినా వారికి కనీసం న్యాయం జరిగేటట్టు చూడని రవికి నరసయ్య మరణం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో చదివిన చదువులకు కొలువు దొరకక ఆత్మహత్య చేసుకున్న నరసయ్య మరణాన్ని అనారోగ్య సమస్యంటూ వక్రీకరించటం దుర్మార్గమన్నారు.