Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
నేషనల్ ఫెలోషిప్లో 'నెట్' నిబంధన తొలగించే విషయాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ప్రస్తావించేలా చేయాలని కోరుతూ..తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్కను ఓయూ విద్యార్థులు కలిసి వినతిపత్రం అందజేశారు. అదే విధంగా అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు నిధులు విడుదల చేసి డిపార్ట్మెంట్ ఫెలోషిప్లు వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. టీబీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మెర స్టాలిన్, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గాదె. వెంకట్, ఆదివాసి నాయకులు సాగబోయిన.వేదిక కార్యదర్శి దర్శనం జాను, శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నారు.