Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాక్య ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ పాల ధరలు రూ.3 పెంచడాన్ని పట్నం కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు కార్యదర్శి మారన్న ఒక ప్రకటనలో తెలిపారు. పెంచిన ధర నిర్ణయాన్ని విరమించుకొని ప్రజలకు అందు బాటు ధరలోనే విక్రయించాలని ప్రభు త్వాన్ని కోరారు. హైదరాబాద్ నగరంలో పేదల బస్తీలో, మధ్యతరగతి ప్రజానీకం ఎక్కువ మంది విజయ పాలను వినియోగిస్తు న్నారన్నారు. కాని ప్రభు త్వం గత నెలలో రూ.2, మళ్ళీ రూ. 3 మొత్తంగా రూ.5ను రెండు నెలల కాలంలోనే పెంచి ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తున్నదన్నారు. ఈ పెరిగిన ధరల ప్రకారం వినియోగదారులపై నెలకు రూ .1.87 కోట్లు భారం మోపుతు న్నార న్నారు. దీన్ని చూసి ప్రయివేటు డెయిరీ వాళ్లుకూడా రేటుల పెంచే ప్రమాదము ందన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని పెంచిన పాలధరలు నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు.