Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్రిపోర్టర్
రంగస్థలం నిర్వహణ నటనలో శిక్షణ పాత్రోచిత ఆభరణాల దుస్తుల రూపకల్పనలో నైపుణ్యం సంపూర్ణంగా తెలిసిన ధీక్షిత్ రంగస్థల దార్శనికుడని తెలంగాణ ప్రభుత్వ సలహదారు డాక్టర్ కేవి రమణ నివాళులర్పించారు. యువ కళావాహిని సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రంగస్థల ప్రయోక్త డీఎస్ ధీక్షిత్ మాస్టారు ప్రథమ వర్థంతి సంస్మరణ సభ రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ముఖ్య అతిధిగా డాక్టర్ రమణ మాట్లాడుతూ వాచకంలోను నటనలలోను అత్యంత ప్రతిభాసమన్వితుడు ధీక్షిత్ అన్నారు. వీధి నాటకం నుండి రంగస్థలంపై ప్రదర్శించే నాటకాల వరకు ప్రతి ఒక్కటి సృజనతో కూడి ధీక్షిత్ మేధో పరిజ్ఞా నానికి దర్పణంగా నిలిచేవని వివరించారు. సంగీత నాటక అకాడమీ అధ్యక్షు లు శివకుమార్ అధ్యక్షత వహించిన సభలో నాటక రచయిత సంజీవి, సీఎస్ రావు, టీవి యాంకర్ జాన్సీ, నటి శివపార్వతి, రచయిత్రీ విజయలక్ష్మి, రంగస్థల ప్రముకుడు గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొని ధీక్షిత్తో తమకు ఉన్న అనుబందాన్ని గుర్తుకు చేసుకున్నారు. వైకే నాగేశ్వర్ మాట్లాడుతూ నటనే శ్వాసగా జీవించి తుది ఊపిరి కూడ నటిస్తూనే వదిలారని గుర్తు చేశారు.