Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జీడిమెట్ల
సూరారం డివిజన్ పరిధి న్యూ శివాలయ నగర్లో మంగళవారం ముత్మాలమ్మ తల్లి నాల్గో వార్షి కోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు నిర్వహించారు. స్థానిక వార్డ్ కమిటీ సభ్యులు జానకి రామ్ మాట్లాడుతూ.. స్ధానికులతో కలిసి ఐకమత్యంతో ఏటా అమ్మవారికి ఘనంగా వార్షి కోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో న్యూ శివాలయనగర్ టీఆర్ఎస్పార్టీ అధ్యక్షులు మన్నె వీరేశం, దొడ్ల బాలయ్య, నర్సారెడ్డి, గోపాల్ కుషల్కుమార్, రవి, శ్రీనయ్య, వెంకటేష్ పాల్గొన్నారు.