Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
చర్లపల్లి ఐఓసీ నుంచి వచ్చే డీజిల్ ట్యాకర్లను మల్లాపూర్ గోకుల్నగర్లో ఆపి ట్యాకర్ల నుంచి డిజిల్ తీసి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తులను మంగళవారం నాచారం పోలీస్లు అధుపులోని తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం నాచారం వీఎస్టీ కాలనీకి చెందిన జిల్లా బుచ్చయ్య కుమారుడు జిల్లా అశోక్ (28) ట్యాకర్ డ్రైవర్ కరీముల్లా చంద్రమౌళి(40) లారీ క్లీనర్ మోతమర్రి తిరుపతి(25)లను ట్యాంకర్ నుండి డిజిల్ తిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఏపీ37టీడీ5991 నెంబరు గల డిజిల్ ట్యాంకర్తో పాటు రెండు డబ్బాలు, 60 లీటర్ల డిజిల్, పైపు, బకేట్ను స్వాధీనం చేసుకుని నింధితులను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులకు అప్పగించారు.