Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
అడిషనల్ కమిషనర్ ఇక్బాల్ సిద్ధికి, బంజారాహిల్స్ ఏసీపీ కెఎస్రావు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ రహమత్ నగర్లో మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో ముగ్గురు ఇన్స్పెక్టర్లు జూబ్లీహిల్స్ మంగళహాట్ డీఐలతో పాటు పది మంది ఏఎస్ఐలు 22మంది పీసీలు పాల్గొని దాదాపు 200 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని నెంబర్ ప్లేటు లేని ఓనర్ ఎవరో తెలియని తొమ్మిది ఆటోలు, 15ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. వీటిపై దర్యాప్తు చేసి వివరాలను త్వరలో పూర్తి స్థాయి వివరాలు ఏసీపీ తెలియజేస్తామన్నారు.