Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మూడుచింతలపల్లి/తూంకుంట:
నిరుపేదల కోసం ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న రేషన్బియ్యం డీసీఎం వ్యాన్లో తరలిస్తున్న 40కిలోల రేషన్ బియ్యాన్ని బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకుని మంగళవారం శామీర్పేట పోలీసులకు అప్పగించారు. మూడుచింతలపల్లి మండలంలోని జగన్గూడ గ్రామంలో మనిగండ్ల చంద్రశేఖర్ ఓ డీసీఎం వ్యాన్లో బియ్యాన్ని తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.