Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ఓ బాలుడికి గాయాలైన ఘటన జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. హేమంత్(12) తల్లిదండ్రులు కొంతకాలం కింద మృతిచెందడంతో అతని నాన్నమ్మ, తాతయ్యల వద్ద జగద్గిరిగుట్టలోని మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో ఉంటున్నాడు. అయితే సోమవారం సాయంత్రం ఆలయంలో పూజ చేస్తుండగా ప్రమాదవశాత్తు బాలుడి దుస్తులకు మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు బాలున్ని కూకట్పల్లిలోని రాందేవ్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఆర్ఎస్ నాయకులు జె.కె.శేఖర్యాదవ్ ఆస్పత్రికి వెళ్లి బాలున్ని పరామర్శించారు. అనంతరం బాలుడి చికిత్స నిమిత్తం రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేశారు. దాతలు ఎవరైనా బాలున్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని వారు కోరారు.