Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సికింద్రాబాద్
దశల వారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్టు కార్పొరేటర్ విజయకుమారి అన్నారు. అడ్డగుట్ట డివిజన్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం వార్డు కమిటీ సమావేశం కార్పొరేటర్ విజయకుమారి నిర్వహించి ఆమె మాట్లాడుతూ డివిజన్లో ఉన్న సమస్యలను వెంటవెంటనే పరిష్కరించుకోవాలన్నారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని వార్డ్ కమిటీ సభ్యులకు సూచించారు. డివిజన్లో ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తే డివిజన్ సమస్యలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు చేస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.