Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాష్ట్రంలో పీఆర్సీలపై కేసీఆర్ కాలయాపన చేయడం తగదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పీఆర్సీ అమలు చేయకుండా కేసీఆర్ కాలయాపన చేస్తున్నారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 24 వేలు చెల్లించాలన్నారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, ఇండ్రస్టీ, ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న జీఓలను అమలు చేయడం లేదన్నారు. ఇటీవల నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు లక్షల్లో పాల్గొన్నారన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కార్మికులు దశాబ్ద కాలం పోరాడి సాధించుకున్న జీఓలను కేంద్ర ప్రభుత్వం మార్పుచేయడం వెంటనే మాను కోవాలన్నారు. కార్మికులందరి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడితే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. మార్చి 6, 8న నిర్వహించే మహిళా సదస్సును విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమం లో రంగారెడ్డి జిల్లా నాయ కులు చంద్ర మోహన్, జగదీష్, కిషన్, బ్రహ్మ య్య, కవిత, మల్లేష్, రుద్రకుమార్, కురు మయ్య, సాయి బాబా, రవికుమార్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో : పీఆర్సీ గడువు పెంపును డిసెంబర్ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకో వాలని మంగళవారం టీఎస్యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి సంజీవరావు, ఏ సింహాచలం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించిందని మరోసారి పొడిగించడం అన్యాయమని, గతంలో ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చల సందర్బంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆర్థిక మాంద్యం, పెరిగిన నిత్యావసర ధరలతో సాధారణ ప్రజలతో పాటు, ఉద్యోగ, ఉపాధ్యాయులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పీఆర్సీ గడువు పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. గతంలో పీఆర్సీ ఆలస్యమైన సందర్భాలలో కనీసం ఐఆర్ ప్రకటించే వారని, పక్క రాష్ట్రంలో 27శాతం ఐఆర్ ఇస్తున్నారని గుర్తుచేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు దీనంగా ఎదురుచూసే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క సర్వీస్ రూల్స్ అంశం పరిష్కారానికి నోచుకోక పదోన్నతులు లేకుండానే అనేకమంది ఉపాధ్యాయు లు నిరుత్సాహంతో పదవీ విరమణ చేస్తున్నా రన్నా రు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పడటం లేదన్నారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో జరిగే ఐక్య ఉద్య మాలలో పాల్గొనడానికి ఉపాధ్యా యులంతా సిద్దంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు.