Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్రిపోర్టర్
పండుగత్తాదంటే చాలు వచన కవిత్వం తెలంగాణ భాషలో రచించి ప్రసార భారతి జాతీయ స్థాయిలో నిర్వహించిన సింఫోసిజమ్ లో 2020 జాతీయ కవిగా గుర్తింపు పొందిన భాషా సాంస్కృతిక శాఖా సంచాలకులు మామిడి హరికృష్ణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉత్తమ అధికారులకు, ఉద్యోగులకు బహుకరించే అవార్డుకు ఎంపికయ్యారు. మంగళవారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ మామిడి హరికృష్ణకు ఉత్తమ అధికారిగా అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ. కేసీఆర్ స్ఫూర్తితో తాను తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నానని పొందిన అవార్డు తన శాఖా ఉద్యోగులందరికీ అంకితమని తెలుపుతూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.