Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్పేట్
చార్మినార్ జోన్ పరిధిలోని ఫలక్నుమా సర్కిల్-10 పరిధిలోని పెండింగ్లో ఉన్న ఆదాయ పన్నును వసూలు చేయాలని సర్కిల్-10 డిప్యూటీ కమిషనర్ జగన్ అన్నారు. పన్ను వసుళ్లపై సర్కిల్ ఏఎంసీ, సూప రింటెండెంట్, టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లతో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్పై ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో ఆదాయపు పన్ను వసుళ్ల తీరు, కలెక్షన్ ఎంత వరకూ నిర్వహించారని ఆరా తీశారు. ఆన్లైన్లో పెండింగ్ ఉన్న పన్నులను వెంటనే వసుళ్లు చేయాలని సూచించారు. ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా వసుళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యాక్రయమంలో ప్రాపర్టి ట్యాక్స్ ఆధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.