Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఈ 22న పీడీఎస్యూ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని పీడీఎస్యూ గ్రేటర్ అధ్యక్షులు రియాజ్ అన్నారు. మం గళవారం కోఠి ఉమెన్స్ కళాశాలలో పీడీఎస్యూ రాష్ట్ర స్థాయి సదస్సు వాల్ పోస్టర్ను విద్యార్థినులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ.. రాష్ట్రంలో ఆరేండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాల నతో ఉన్నత విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదు ర్కొంటున్నదన్నారు. విశ్వవిద్యాలయాలు సమ స్యలకు నిలయంగా మారయని, క్యాంపస్ విద్యా ర్థులు, విద్యా ర్థినులు ఎదుర్కొంటున్న మౌలిక సమ స్యల పరిష్కారం కోసం పీడీఎస్యూ అలుపెరగని పోరాటం చేస్తున్నదన్నారు. తెలంగాణలోని యూనివర్సిటీలలో కొన్ని దశాద్దలుగా ప్రొఫెసర్ల నియామకాలు లేక విద్యార్థులకు, సక్రమంగా విద్యాబోధన నిర్వహించడంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కళాశాలలో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ ఉపాధ్యక్షులు కే గణేష్, విద్యార్థి నాయకురాలు రాణి, గిరివర్థిని, చందన, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.