Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ
నవతెలంగాణ-మెహిదీపట్నం
రాష్ట్రంలో కనుమరుగవుతున్న కళారూపాలను బతి కించడం కోసం ప్రజా నాల్యమండలి(పీఎన్ఎం) నిరం తరం కృషి చేస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి కట్టా నర సింహ అన్నారు. ప్రజానాట్యమండలి హైదరాబాద్ సౌత్ కమిటీ నూతన కమిటీ సమావేశం అత్తాపూర్లోని కార్యా లయంలో నిర్వహించారు. ప్రజా నాట్యమండలి కళ.. కల కోసం కాదని, ప్రజల కోసం, ప్రగతి కోస మన్నారు. అభ్యుదయ సంఘంగా ప్రజా నాట్యమండలి మహిళా హక్కులపై, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, కుల రహిత సమాజం కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజానాట్యమండలి కలం, గళం విప్పు 0తోందన్నారు. ఎంతో మంది మహనీయుల ఆశయసాధన కోసం ప్రజానాట్యమండలి నిరంతరం పనిచేస్తుందని ఆ సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో ప్రజానాట్యమండలి సౌత్ కమిటీ నూతన అధ్యక్షులుగా గోపాల్, కార్యదర్శిగా కళ్యాణ్, సహాయ కార్యదర్శులుగా పూజిత, యశోదా, మహేశ్వరి, కమిటీ సభ్యులుగా జగదీశ్, అరుణ, ప్రత్యూష, మహేశ్వరి, కీర్తన, స్నేహ, స్వప్న, సుచిత్ర, జ్ఞానేశ్వరీ, గిరిజ, సనలు ఎన్నికయ్యారు.