Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య
- 14 బీసీ సంఘాల నేతలు కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డితో చర్చలు
నవతెలంగాణ-నారాయణగూడ
ఏప్రిల్-1 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించే జనాభా లెక్కలను కులాల వారీగా తీయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.మంగళవారం హైదర్గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 14 బీసీ సంఘాల నాయకులు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో కేంద్ర హౌం సహాయక మంత్రి జి.కిషన్రెడ్డితో చర్చలు జరిపారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల జనాభా గణనకు సంబంధించిన 31 కాలమ్స్తో కూడిన నమూనా పత్రాలను కిషన్రెడ్డికి అందించారు.ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం హౌం శాఖ ద్వారా జారీ చేసిన నమూనా పత్రంలో ఎస్సీ, ఎస్టీల వివరాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర మతాల వివరాలు ఇతర వివరాలకు సంబంధించిన కాలం నమూనా పత్రాన్ని జారీ చేశారన్నారు.కానీ ఈ జనాభా లెక్కల పట్టికలో బీసీ కులాల వివరాలకు సంబంధించిన 31 కాలమ్స్ పట్టిక చేర్చలేదన్నారు. బీసీ జనాభా లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులకు గురవుతు న్నాయన్నారు.
కులాల వారిగా జనాభా లెక్కలు తీయడం న్యాయమైన డిమాండ్ : కులాల వారీగా జనాభా లెక్కలు తీయడం అనేది న్యాయమైన డిమాండ్ అని, దీనిపై త్వరలో బీసీ సంఘాలను ఆహ్వానించి కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షాతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని కిషన్రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ నీలవెంకటేష్, పలు బీసీ సంఘాల నాయకులు రామ్కోటి, బర్కకృష్ణ, అనంతయ్య, రాజేందర్, చంద్రశేఖర్, రామకృష్ణ, సురేష్, వెంకటేష్, రాహుల్, సతీష్ పాల్గొన్నారు.