Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
నేడున్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాలమ హానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకిదయాకర్ అన్నారు. ఘట్కేసర్ పట్టణంలోని పద్మారెడ్డిగార్డెన్లో మంగళ వారం నిర్వహించిన ప్రజా ఉద్యమ పునరహిత అనే సభలో పాల్గొని మాట్లాడుతూ..నేడు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్పీఆర్ మత ప్రసక్తిగా ఉండబోతుందన్నారు. మార్చి 1న కాకినాడులో జరుగ నున్న మాలల మహా యుద్దబేరి సభకు మాలలంతా రాజ్యాంగాన్ని కాపాడుకోవాడానికి అంబేడ్కర్ వాదులుగా పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షలు పిల్లి. సుధాకర్, ప్రదాన కార్యదర్శి భైరి.రమేష్, జిల్లా అధ్యక్షులు కనకల.సూర్యం, రాష్ట్ర నాయకలు సత్యనారాయణ, ఎన్ అజరుకూమార్, రవి, అశోక్, ఘట్కేసర్ రైతు సేవా సహాకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, ఎస్పీఎస్టీ మానీటరింగ్ కమిటీ సభ్యులు తాల్క.రాములు, మండల నాయకులు మేకల.నర్సింగారావు, దార బ్రదర్స్. శ్రీనివాస్, రాజేష్, బద్దం. కూమార్, పడిగం. బ్రదర్స్. ప్రవీణ్, ప్రశాంత్, రాజ్యాంగ వేధిక మండల అధ్యక్షులు బీరం. సతీష్,పడిగం. వీరేషం పాల్గొన్నారు.