Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు విలువలతో కూడిన విద్యనందించడమే లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లక్ష్యం అని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్ వెన్న ఉమారాణి తెలిపారు. మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దూలపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6,7,8 తరగతుల విద్యార్ధులకు కరదీపిక అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎలైట్ సంస్ధ వారి సహకారంతో ఇటీవల పలు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యా యు లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. విద్యార్ధుల వారి నైపుణ్యం పెంపొందించుకోవడానికి ఇలాటి తరగతులు ఉపాధ్యా యులకు ఎంతో అసరం అన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో విద్యార్ధులకు సులువుగా అర్ధం అయ్యే రీతిలో కరదీపికలు ఎంతో ఉపయోగపడతా యన్నారు. విద్యార్ధుల్లో దాగి ఉన్న ప్రతిభను పెంపొ ందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. కేవలం పాఠ్యపుస్తకాల ద్వారా విద్యను అందించడమే కాకుండా వాటికి తోడుగా విద్యార్ధి సమాజంలో జరుగు తున్న విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. ఉపాధ్యాయుల కృషి , విద్యా ర్ధుల పట్టుదల ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అత్యధిక ర్యాంకులు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శివ ప్రసాద్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.