Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
నవతెలంగాణ-కేపీహెచ్బీ
మహిళల అభ్యున్నతికి, సాధికారతకు ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆయన కార్యాలయంలో మంగళవారం కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీ అసోసియేషన్ సభ్యులు మహిళ మండలి భవనంలో నిర్వహించే ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రంలో భాగంగా సొంత డబ్బులతో కుట్టుమిషన్లను తెప్పించి అసోసియేషన్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలో మహిళామండలి భవనంలో ఉచిత కుట్టు మిషన్ కేంద్రం ఏర్పాటు చేసి పేదమహిళలకు, విద్యార్థులకు, ఉచిత శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంతో సెంటర్ను ప్రారంభించడం అభినంద నీయమన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యు లు నాగేశ్వర్రావు, కయ్యుమ్, కృష్ణ, ప్రసాద్, లావణ్య, జ్యోతి, టీఆర్ఎస్ నాయకులు జిల్లా గణేష్, కాశీనాథ్, బ్రిక్ శ్రీను, సాంబయ్య, స్వరూప పాల్గొన్నారు.
చెరువులను సుందరీకరిస్తాం
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రతి చెరువును అభివృద్ధిచేసి వాటిని సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. హైదర్నగర్ డివిజన్ పరిధిలోని అంబిర్చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా చేపట్టిన వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను మంగళవారం ఆయన ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ.. చెరువులు కలుషితం కాకుండా, కబ్జాలకు గురికాకుండా పూర్తిస్థాయిలో పరిరక్షి స్తామన్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో కాలుష్యం పెరుగుతోందని దీని నుంచి బయటపడేందుకు పర్యావరణాన్ని పరిరక్షించ ుకోవాల్సిన అవసరము న్నదన్నారు. మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తేవడమే తమ ప్రయత్నమని తెలిపారు. చెరువులను కబ్జాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఇరిగేషన్ ఏఈ విశ్వం, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు నాయినేని చంద్రకాంత్రావు, జోగిపేట బాల్రాజు పాల్గొన్నారు.