Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ వ్యాప్తంగా హమాలీలందరకీ ఒకే రేటు ఉండాలి
- 24 నుంచి మార్చి 2 వరకు దేశవ్యాప్త నిరసనలు
- ఎఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు టి.నర్సింహ
నవతెలంగాణ-ముషీరాబాద్
హమాలీ కార్మికులకు సమగ్ర సంక్షేమ చంట్టం అమలు చేయాలని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు టి.నర్సింహ డిమాండ్ చేశారు. మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్లో తెలంగాణ రాష్ట్ర హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ ధర్నా నుద్దేసించి నర్సింహ మాట్లాడుతూ దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ కార్మిక వ్యతిరేక విధానాలను అమలుపరుస్తూ కార్మికులకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గానికి అన్యాయం చేస్తూ కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా హమాలీ కార్మికులు అందరికీ ఒకే రేటు అమలు చేయలని డిమాండ్ చేశారు. ఎస్ డబ్య్లూసీ వ్యవసాయ మార్కెట్ యార్డు హమాలీలకు లైసెన్సులు, పీఎఫ్, ఈఎస్ఐ, యూనిఫాం అందించాలని కోరారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్.బాలరాజ్ మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికులకు వేతనాలు 24 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. అన్ని గోడౌన్లను ప్రభుత్వ గోడౌన్లుగా నిర్మానం చేయాలని కోరారు. ఏఐటియూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి.ఎస్.బోస్ మాట్లాడుతూ హమాలీ కార్మికులకు పదివేల రూపాయల బోనస్ చెల్లించాలని, ప్రమాదవశాత్తూ కార్మికులు మరణిస్తే పదిలక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలతో సాధించి తెచ్చుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం సవరణల పేరుతో పెట్టుబడిదారులకు, కార్పోరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా, కార్మికు వ్యతిరేక బడ్జెట్ అని, దీనిని నిరసిస్తూ ఈనెల 24 నుండి మార్చి 2 వరకు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శులు బి.చంద్రయ్య, ఎం.నర్సింహ్మ, నాయకులు తోట భిక్షం, వై.ఓమయ్య, మల్లయ్య, జి.నరయ్య, సాంబయ్య, సత్యనారాయణ, ఎం.ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.