Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కార ణంగా బాగ్ అంబర్పేట డివిజన్ పరిధిలోని కుమ్మర్ వాడిలో రెండు నెలలుగా కలుషిత నీటి సరఫరా జరు గుతోంది. రెండు నెలల క్రితం పైపులైన్ నిర్మాణం చేపట్టి గుంతలు తవ్వారు. నిర్మాణ పనులు పూరైన తర్వాత గుంతలను పూడ్చాల్సిన కాంట్రాక్టర్ ఆలాగే వదిలి వేయడంతో గుంతల్లో నీరు చేరి, అవి కాస్తా.. పైపులైన్లో కలుస్తూ కలుషిత నీరు సరఫరా అవు తోంది. రెండు నెలలుగా బస్తీ ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. రెండు నెలలుగా పూడ్చకుండా వదిలేసిన పైపులైన్ దర్శ నిమిస్తున్నా.. అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు వాపోతున్నారు. కలుషిత నీటితో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నా జల మండలి అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా తవ్వెసిన గుంతలతో అటు వాహనాదురులు అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. రాబోయే బోనాల పండుగను పురష్క రించుకునైనా అధికారులు తవ్వెసిన గుంతలను పూడ్చి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరు తున్నారు. సకాలంలో స్పందించి సమస్యలను పరిష్క రించకుంటే వాటర్ వర్క్స్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.