Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని అనుమతులు లేని నిర్మాణాలపై అధికారులు కోరడా ఝూలిపించారు. మంగ ళవారం తెల్లవారు జామున మున్సిపల్ కార్పొరేషన్ అధి కారులు పోలీసు బందోబస్తు మధ్యన చెంగిచెర్ల క్రాంతి కాలనీలోని సర్వే నెంబర్ 76/1నుంచి 76/6 వరకూ ఉన్న భూమిలో నిర్మించిన ప్రహారిని జేసీబీల సహాయంతో తోల గించారు. అనంతరం బోడుప్పల్ సాయిఎన్క్లేవ్లో అను మతులు లేకుండా చేపట్టిన నిర్మాణాన్ని కూడా కూల్చి వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్.శంకర్, నగర ప్రణాళిక అధికారి నాగిరెడ్డిలు మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధిలోని వివిధ కాలనీల్లో అనేక చోట్ల అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న విషయంపై అనేక ఫిర్యా దులు అందాయని ఉన్నాతాధికారుల సూచనల మేరకు పోలీసుల సహాయంతో వాటిని తొలగించామని భవి ష్యత్లో కూడా అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. సందర్భంగా మేడిపల్లి సీఐ బీ.అంజిరెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
మిగతా అనుమతి లేని నిర్మాణాలపై చర్యలుంటాయా..?
బోడుప్పల్ నగర పాలక సంస్థ ఏర్పాటైన నాటి నుండి నేటి వరకూ వేల సంఖ్యలో అనుమతులు పోందకుండానే నిర్మాణాలు చేపట్టిన దాఖాలలు అనేకంగా ఉన్నాయి. అయితే నేడు అధికారులు స్పందించిన తీరు హర్షిం చదగినదే అయినప్పటికీ ఇతర అనుమతులు లేని నిర్మా ణాల విషయంలో కూడా చర్యలుంటాయా లేదా చూడాలి. ఓక వేళ ఇక్కడితోనే కూల్చివేత్తలు నిలిపివేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా కక్షసాధింపు చర్యగానే భావించాల్సి ఉంటుం దనేది పలువురి మనసులో మాట.
ముమ్మటికీ కక్ష సాధింపు చర్యే
బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో అనేక కాలనీ ల్లో ఏలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మా ణాల జోలికి వెల్లకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తమ పార్టీకి చెందిన వారి నిర్మా ణాలను మాత్రామే కూల్చివేశారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు పోగుల నర్సింహ్మ రెడ్డి ఆరోపించారు. అధి కారులకు చిత్త శుద్ధి ఉంటేఅన్ని నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం టీఆర్ఎస్ పార్టీ నేతలు చేసిన ఒత్తిళ్ల మేరకే నేడు ఈ కూల్చివేత్తలు చేప ట్టారని అయన వాపోయారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ సెల్ వైస్ చైర్మెన్ తోటకూర వజ్రెష్ యాదవ్, కార్పొరేటర్లు అజరు యాదవ్, కళ్యాణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నేతలు కొత్త కిషోర్ గౌడ్, దానగళ్ల యాదగిరి, పీ.వెంకటేశ్ గుప్త, కత్తి వెంకట్ రెడ్డి, బక్క రమేష్ యాదవ్, తోటకూర మల్లేష్ యాదవ్, రాజు యాదవ్, చింతల శ్రీనివాస్ రెడ్డి, శివ పాల్గొన్నారు.