Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- జవహర్నగర్
జవహర్నగర్ ప్రధాన రహదారిని సమస్యల పరిష్కార దిశగా మేయర్ కావ్య చర్యలు చేపట్టారు. జవహర్ నగర్ను ఇతర ప్రాంతాలతో కలిపే ప్రధాన రహదారులలో యాప్రల్ మీదుగా వచ్చే రహదారి ముఖ్యమైంది. దమ్మాయిగూడ మీదు గా ఔటర్ రింగు రోడ్డుతోపాటు నగరంలోని ఇతర ముఖ్య ప్రాంతాలను ఈ రహదారినే కలుపుతుంది. ఇదే రహదారి జవహర్ నగర్కు ముఖ్యమైనది. అయితే ఈ రహదారి గుంటలతో ప్రమాదకరంగా మారింది. గుంటల మయమైన రహదారిపై వెళ్లాలంటే వాహనదారులు జంకుతున్నారు. విష యం తెలుసుకున్న మేయర్ మేకల కావ్య జిల్లా ఇంచార్జి మంత్రి మల్లారెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మంగళవారం కలిసి సమస్యను వివ రించారు. అంతేకాకుండా సమస్యను పరిష్కరించాల్సిందిగా లేఖను అందజేశారు. దాంతో సానుకూలంగా స్పందించిన మంత్రులు సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, టి.ఆర్.ఎస్ యువజన నాయకులు మేకల భార్గవ్ రామ్లు పాల్గొన్నారు.