Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మలక్పేట్
మలక్ పేట్లోని హసీనా వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది పేద కుటుంబాలకు నిత్యావసర వస్తు వులు, కూరగాయలు, మాస్క్లు పంపిణి చేసినట్టు ట్రస్ట్ నిర్వాహకులు షేక్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. మంగళవారం ట్రస్ట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. లాక్ డౌన్ అనంతరం ట్రస్ట్ ద్వారా పేద కుటుంబాలకు నిత్యావసర సరకులు అందచేస్తున్నామని వివరించారు. లాక్ డౌన్ సడలిం చినప్పటికీ చాలా మందికి పని దొరకక, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి తమ బాధ్యతగా నిత్యావసర వస్తువులు అందజేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మంది పేద కుటుంబలను ఆదు కుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
క్వారంటైన్లో ఉన్న వారికి నిత్యావసరాలు
అందజేసిన మున్సిపల్ మేనేజర్
దమ్మాయిగూడ : దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గహకల్ప కాలనీలో హౌమ్ క్వార ంటైన్లో ఉన్న కుటుంబానికి దమ్మాయిగూడ మున్సిపల్ మేనేజర్ వెంకట్ రామ్ ఆర్థిక సహకారంతో మూడు వేల రూపాయల విలువగల బియ్యం, గుడ్లు తదితర నిత్యావసరసరుకులను మంగళవారం కమిషనర్ ఏ.స్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఇంటి పరిసరాల ప్రాంతంలో కౌన్సిలర్ కొత్త హేమలత శ్రీనివాస్ గౌడ్ హైపో క్లోరైడ్ స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో రంగయ్య, శ్యామ్ కుమార్, సుబ్బరాజు, రాజశేఖర్, రాజు, సాయి, రఘు, లక్ష్మీ, సత్యతోపాటు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.