Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
కాప్రా డివిజన్ సాయిబాబా నగర్లో రూ.కోటి పదిలక్షల వ్యాయంతో సీసీ రోడ్డు పనులను మంగ ళవారం ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజు, డివిజన్ అధ్యక్షుడు సుడుగు మహేం దర్రెడ్డితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత పాలకుల వైఫల్యంగా 35 ఏండ్ల నుంచి సరైన రోడ్లు, డ్రయినేజీ, తాగునీరు వంటి సమస్యలను పరిష్కరించలేదన్నారు. కానీ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాటి నుంచి పెండింగ్లో ఉన్న పనుల న్నింటినీ పూర్తి చేస్తున్నామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి ఎల్లవేళలా అండగా ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు సరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం బాలకష్ణ, అభిషేక్, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, గిల్బర్ట్, కొప్పుల కుమార్, పవన్, సుంకంయాదగిరి, బాలయ్య, సుంకరి సుశీల్, ప్రదీప్, శ్రీనివాస్, బంక వెంకటేష్, గౌస్, భిక్షపతి, కొండల్గౌడ్, నర్సింహ, శంకర్, లింగం, సోమనాథ్, వెంకటేష్, సుజాత, సురేఖ పాల్గొన్నారు.
డబుల్ ఇండ్ల పరిశీలించిన ఎమ్మెల్యే : కాప్రా డివి జన్లో పరిధిలోని సాయిబాబానగర్లో నిర్మిస్తున్న డబు ల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి, స్థా ని క కార్పొరేటర్ స్వర్ణరాజు, డివిజన్ అధ్యక్షులు సు డు గు మహేందర్రెడ్డి ప్రాజెక్ట్ మేనేజర్తో కలిసి, పరిశీలించారు.