Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పాతబస్తీలో యాంటీ వైరల్ డ్రగ్స్ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును సౌత్జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు రట్టు చేశారు. 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కరోనా టెస్ట్ చేసే ర్యాపిడ్ కిట్స్, ఇంజక్షన్లతోపాటు 8 సెల్ఫోన్లు, రూ.55వేల నగ దును స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.35.55లక్షలుంటుందని పోలీసులు తెలిపారు. మంగ ళవారం నగర పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు డీసీపీ చక్రవర్తితో కలిసి నగర పోలీ సు కమిషనర్ అంజనీకుమార్ వివరాలను వెళ్లడించారు. సికింద్రాబాద్కు చెందిన కె. వెంకట సుబ్రమణ్యం, హబూబ్నగర్కు చెందిన సంతోష్కుమార్, ఫీల్కానాకు చెందిన మాహ్మద్ షేఖర్, ముషీరాబాద్కు చెందిన కె.కిషోర్, నారాయణగూడకు చెందిన రాహుల్ అగర్వాల్, ఢిల్లీకి చెందిన గగన్ ఖురానా, తలాబ్కట్టకు చెందిన సైఫ్ ఆలీ మాహ్మద్, సైదాబాద్కు చెందిన ఫర్దస్ మహ్మద్లు సర్జికల్ వ్యాపారం, మెడికల్స్ ఏజెన్సీ, మెడికల్ డిస్ట్రి బూటర్స్గా వ్యాపారం చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ను అడ్డుపెట్టుకుని సులువుగా డబ్బులు సంపాదించాలని వీరంతా నిర్ణయిం చుకున్నారు. మల్కాజ్ గిరిలో 'శ్రీ మెడీక్యూర్ ప్రొడక్ట్ (ఓపీసీ) ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో సర్జికల్ వ్యాపారం చేసే వెంకట సుబ్రమణ్యం కీలకంగా వ్యవహరించడంతో 8 మంది కలిసి ఒక ముఠాగా ఏర్పాడ్డారు. రెమ్డెసివిర్, యాకె ్టమ్రా, ఫాబిఫ్లూ ట్యాబ్లెట్లతో పాటు తదితర మందులను సంగా రెడ్డిలోని హెట్రో కంపెనీ నుంచి కొనుగోలు చేస్తున్న నిందితులు మార్కెట్లోకి రాకుండా కృతిమ కోరత సృష్టిం చారు. ఆ తర్వాత పాతబస్తీ, తదితర ప్రాంతాల్లో కరోనా బారిన పడిన వారిని టార్గెట్ చేసుకుంటున్నారు. ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితుడి కుటుంబ సభ్యుల టార్గెట్ చేసుకుని బ్లాక్లో మందును విక్రయిస్తున్నారు. అంతటితో ఆగకుండా మెడికల్ రిప్రజెంటెటివ్స్ ద్వారా ఆస్పత్రులకు, డాక్టర్లకు ఇంజక్షన్లను, మందులను బ్లాక్లో సరఫరా చేస్తున్నారు. మార్కెట్లో చలామణి చేస్తున్నారు. ఈ మెడిసిన్కు ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని కృతిమ కోరత సృష్టించిన నిందితులు రూ.10వేల నుంచి లక్ష రూపాయల వరకు బ్లాక్లో విక్రయిస్తున్నారు. వైద్యులు కూడా పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితులకు ఫాబి ఫ్లూ ఇంజక్షన్స్ను వినియోగిస్తుండడంతో ఈ ముఠా సభ్యలు మరింత రెచ్చిపోయారు. సంగారెడ్డి నుంచే కాకుండా ఢిల్లీ నుంచి కూడా మందులను తెప్పిచడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్సు పోలీసులు చదర్ఘాట్ పోలీసులతో కలిసి సంమూక్తంగా దాడులు చేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కరోనా వైరస్ బారిన పడినవారికి 8 మంది బ్లాక్లో యాంటీ వైరల్ డ్రగ్స్ విక్రయిస్తున్నారని విచారణలో తేల్చారు. ఫార్మ కంపెనీల డిస్టిబ్యూటర్స్, మెడికల్ రిప్రజెంటెటివ్స్, మెడ ికల్ షాపు యజమానులు జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. ముఠాగుట్టును రట్టుచేసి, నిందిలను అరెస్టు చేసినందుకుగాను టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ రాఘవేంద్రా, ఎస్ఐలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మాహ్మద్ ఠాకొద్దీన్తోపాటు చాదర్ఘాట్ పోలీసులను సీపీ ప్రత్యే కంగా అభినందించారు.