పాలమూరు జిల్లాకు భీమా పుష్కరాలు తలమానికంగా నిలుస్తున్నాయి. అక్టోబర్ 11వ తేదీ రాత్రి 7:23 గంటలకు గురు తులారాసి నుంచి వృశ్చిక రాశిలోకి మారగానే పుష్కర కాలం ప్రారంభమైంది. మహబూబ్గర్ జిల్లా మక్తల్ నియోజక వర్గంలోని కృష్ణ మండలం తంగిడి గ్రామం వద్ద భీమా నది తెలంగాణలో ప్రవేశిస్తుంది. అందుకే అక్కడ పుష్కరఘాట్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీనివాసరావు, పేట ఆర్డీఓ చీర్ల శ్రీనివాస్, పక్షిమాద్రి విరక్తమఠం నేరేడిగం పీఠాదిపతి పంచమలింగ మహాస్వామి పూ జలు చేసి పుష్కరాలను ప్రారంభించారు. 12 ఏండ్ల కోసారి దేశంలోని ప్రధానమైన 12 నదులకు పుష్కరాలు జరుగుతాయి. కావేరి పుష్కరాల అనంతరం భీమా పుష్కరాలు ప్రారంభ మవుతాయి. ప్రతి ఏడాదీ దేశంలోని ఏదో ఒక నది పుష్కరాలు జరుగుతూనే ఉంటా యి. బృహస్పతి ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం లోకి మారుతున్న సందర్భంలో పుష్కరాలు ప్రారంభమ వుతాయి. మహారా ష్ట్రలోని పశ్చిమ కనుమల వద్ద శంకర జ్యోతిర్లింగ క్షేత్రం వద్ద పాండురంగ ఆలయం పక్కన భీమా నది పుట్టింది. ఈ నది మహరాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల మీదుగా 7 వేల కిలోమీటర్లు ప్రవహించి తెలంగాణలో కృష్ణానదిలో కలుస్తుంది. రాష్ట్రంలో కేవలం కొన్ని చోట్ల మాత్రమే పుష్కర ఘాట్లు ఏర్పాటు కావడంతో భక్తులు పెద్దఎత్తున పుష్కరస్నానం ఆచరించడానికి వస్తున్నారు. ఈ పుష్కరాలు 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి.తంగిడి, కుసునురు, సుకురలింగంపల్లి గ్రామాల్లో స్నానం ఆచరించడానికి ప్రత్యేకంగా ఘాట్లు ఏర్పాటు చేశారు. పుష్కర స్నానం అచరిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.
నదులను ఆనుకొనే నివాసాలు ఏర్పాటుచేసుకోవడం పూర్వం నుంచి కొనసాగుతున్నదే. తాము ఎక్కడుంటే అక్కడే గుడులు, గోపురాలు కూడా నిర్మించుకోవడం సహజమే కదా. ఆ విధంగా నదుల ఒడ్డునే పుణ్య క్షేత్రాలూ నిర్మితమయ్యాయి. నీళ్లు నిల్వ ఉండే కుంటలు, చెరువులు, బావుల్లో ఉండే నీటికన్నా పారే నదులు, సెలయేళ్లలో స్నానం చేస్తే మంచిదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు మానవులు. నదులన్నీ పర్వతాల్లో పుట్టి పారుతున్నాయి కాబట్టి ఔషధ మూలికలను తడుపుతూ వస్తయి కాబట్టి నది నీటికి ఔషధ గుణం ఉంటుందని భావించారు. చర్మవ్యాధుల వంటివి ఈ నీటిలో స్నానం చేయడం వల్ల మాయమై ఉండవచ్చు. అందుకే ఈ నదుల నీటికి మహిమ ఉందని భావించడం ప్రారంభించారు. ఇదే జలాన్ని ఆరాధించడానికి కారణమై ఉండవచ్చు. ఈ ఆరాధన నుంచే పుష్కరాలు పుట్టి ఉండవచ్చు.
-ఎన్. అజయ్కుమార్
Authorization