నవీన శిలాయుగంలో ప్రారంభమైన జంతువులను మచ్చిక చేసుకోవడం ఆ తరువాతి యుగాల్లో మానవుని జీవన యాత్రను మార్చివేసింది. సంచార జీవితం గడిపే రాతి యుగ మానవుడు స్థిరపడి వ్యవసాయం చేస్తూ, పశువుల మందలను అభివృద్ధి చేసుకోవడంతో పాడి-పంటలు జీవన నౌకకు కాడెద్దులయ్యాయి. ఎన్ని పశువులు ఉంటే అంత గొప్పగా భావించేవారు. ఈ పరిస్థితి మధ్యయుగాల వరకూ కొనసాగింది భారతదేశంలో. (ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక తెగలు ఆలమందలను సంపదగా చూస్తున్నారు). ఎంత పెద్ద రాజులు, చక్రవర్తులైనా పశుపాలన వారి ముఖ్య వృత్తిగానే ఉండేది. భారతం, ఇతర ఇతిహాసాలు ఇందుకు మంచి సాక్ష్యాలను చూపుతాయి. జనగాం సమీపంలోని ఖిలాషాపూర్ వాసి మారపాక రమేష్ అనే బైండ్ల కళాకారుడు చెప్పిన 'పెద్దమ్మ కథ'లోనూ ఆలమందల ప్రాముఖ్యత కనిపిస్తుంది. అదే సమయంలో సంతానం కోసం ఆకాలంలో దంపతులు పడే వేదనా కనిపిస్తుంది. ఎంత సంతానం ఉంటే పశుపాలక సమాజాల్లో అంత ప్రయోజనం కదా. అందుకే ఇంత తపన చెందిఉంటారు.
అయోధ్య పట్టణం వాళ్లది. అయోధ్య పట్టణాన్ని ఏలేవారు వలరాజు, వలరాజు భార్య వల్లమా దేవి. వల్లమాదేవికి సంతానం అవుతున్నది కాని పుట్ట పెట్ట అవుతున్నాది (పుడుతున్నారు కాని బతకడంలేదు). వలరాజుతోటి వల్లమాదేవి అంటున్నది ''స్వామి ఇక్కడ ఉంటే ఏం లాభం. ధనమున్నది. ధాన్యమున్నది. మిద్దెలు న్నవి. సవాలక్ష ఆవుల మంద ఉన్నది. కానీ సంతానం ఉండటం లేదు కదా. ఈ పట్టణం మనకు అచ్చువస్తలేదు. వెళ్లిపోదామ''ని అన్నది.
భర్తను సవాలక్ష ఆవుల మందతో బయలుదేర దీసింది. కొంత దూరం వచ్చినతరువాత ఇక్కడొక గుడిసేసుకొని ఉందాం అనుకున్నారట. అక్కడ దొనకొండ కట్టారు. మిద్దెలు కట్టడం, మేడలు కట్టడం అయిల బొయిల చూసుకోవడం, సవాలక్ష ఆవుల మందను చేసుకుంటున్నారు. ఈడికొచ్చినా అమ్మ వారికి సంతాన మవుతల్లేదు. ''ఏంటి స్వామీ అక్కడ సంతానమై చనిపోయేవారు. ఇక్కడ అసలు సంతానమేకావటల్లేదేమిటి? నేనెళ్లి స్వామికి పూజలు కట్టి వస్తా అని చెప్పి శివుని దగ్గరికి వెళ్లి సంతాన ఫలం అడిగింది. స్వామి నువ్వు పూజలు కట్టిరా అని అన్నాడు. సరేనని అమ్మవారు పూజలు కట్టడానికి నది ఒడ్డుకు వెళ్లింది. ఇసుక కుప్పలను శివలింగంగా మార్చుకొని పూల మాలలు వేసుకొని పూజలు చేస్తుందట అమ్మవారు. శివుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకోమన్నాడట. స్వామీ నాకు సంతానం కావాలం దట. సరే ఇదిగో నీకు ఒక కుమారుని ఇస్తున్నా అని వెనక్కి తిరిగి పోతున్నాడట. స్వామీ నాదొక కోరిక. ఏమిటమ్మా అది? ఒక్క కొడుకునిచ్చావు. తోడుకు తోడు కావాలి. నీడకు నీడ కావాలి. ఒక కొడుకు కొడుకు కాదట, ఒక కన్ను కన్ను కాదట స్వామి. రెండో కుమారుణ్ణి కూడా ఈయ్యమన్నదట. సరే నని రెండో ఫలం కూడా ఇచ్చిండట. స్వామి ఇద్దర్ని ఇచ్చావుకదా. ఒక కాలమునందు ఇద్దరు కొట్లాడుచుండ విడిపి చడానికి ఇంకోకళ్లు కావాలి కదా ఇంకో ఫలమియ్యమన్నదట. సరే అని మూడోవాణ్ని కూడా ఇచ్చి వెళ్తున్నాడట శివుడు. స్వామి ముగ్గుర్నే ఇచ్చినావు కదా. నేను కాలం చేసిన రోజున ఎత్తుకొని పోవడానికి నలుగురు కుమారులు కావాలి. ఇంకోఫలమివ్వమ న్నది. సరే ఇంకో ఫలమిచ్చాడు. మళ్లీ వెళ్తుండగా మళ్లీ అడ్డంతిరిగింది. నలుగురు నాలుగు దిక్కుల పడితే కుండబట్టి ముందు నడవాలిగదా ముందు. ఇంకో కుమారుణ్ణి కూడా ఇవ్వమన్నదట. సరే నని ఐదోవాణ్ణి కూడా ఇచ్చి వెళ్తుంటే అడ్డంతిరిగిన అమ్మవారు ''మగపిల్లలు నన్ను ఎత్తుకెల్తుంటే''వెనక ఆడపిల్ల ఏడిస్తే సవాలక్షమంది ఏడుస్తారట. కావున ఒక ఆడపిల్లనియ్యమన్న''దట. సరేనని చెప్పి ఆడపిల్ల సంతానం కూడా ఇచ్చిండట.
అయిదుగురు మగపిల్లల్లో పెద్దాయన సింహాద్రి రాజు. రెండో వాడు పెద్దిరాజు. మూడోవాడు యెలనోకరాజు. నాలుగో వాడు నలనోకరాజు. ఐదోవాడు చిలకల పోల్రాజు. ఆడపిల్లపేరు కొమరమ్మ. వారిని పెంచుతున్నారు. పెద్దకుమారునికి సీతామ హాలక్ష్మిదేవిని తీసుకువచ్చి కళ్యాణం చేశారు. కొంతకాలానికి వలరాజు, వల్లమాదేవి కాలం చేశారు. సింహాద్రిరాజుకు రాజ్య పరిపాలన ఇచ్చారు. తమ్ముడు పెద్దిరాజుకు పెద్దమ్మతో వివాహం జరిపించాడు సింహాద్రి రాజు. మిగతావారి కళ్యాణాలు కూడా అయిపోయినాయి. అందరికీ సంతానమయింది. కానీ పెద్దమాదేవికి సంతానమవ్వడంలేదు. అన్న దమ్ములైదుగురూ ఒక్క చెయ్యి వేళ్లు తీరుగ కలిసిమెలిసి రాజ్యపాలన చేసుకుం టున్నారు. కానీ ఐదుగురి ఏరాండ్లల్లో నేను గొడ్డురాలినైపోతానేమో నని చెప్పి పెద్దమ్మకి ఆవేదనగా ఉంది. ఈ దిగులుతోనే పూజలు చేసి, ఏడ్చి ఏడ్చి మేడలో పడుకొని ఉందట. కళ్యాణపురి (కాశి) పట్టణం నేలేటటువంటి కళ్యాణ సోమన్నకు మాల్యమయిందట ఈమె ఏడ్పు. ఆయన ఈ మేడదగ్గరికి వచ్చి కలలో ఆమెకు సంతానం ఇచ్చినట్టుగా, ఆమె బాలింతరాలు అయినట్టుగా చూపించి, చెంపమీద కొట్టినట్టు లేపి మాయమైపోయి ఒక గోడన అతికి ఉన్నాడట. అమ్మవారు లేచింది. ఈ సంగతి తన ప్రాణేశ్వరునికి చెప్పాలనుకున్నది. ఆ సమయంలో ఐదుగురు అన్నదమ్ములు కచ్చెరిమీద రాజ్య పరిపాలన చేస్తున్నారంట. ఎన్నడూ పిలవనామె మేడెక్కి ప్రాణేశ్వరా రండి అని పిలిచిందట. అందరూ ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు. అన్నముఖం చూశాడు పెద్దిరాజు. సరే పొయ్యిరా అన్నాడు సింహాద్రి. పెద్దిరాజు వచ్చి ఏమిటని అడిగితే ''ప్రాణేశ్వరా మనకు సంతాన ఫలం కళ్యాణ సోమన్న ఇస్తాడంట. అన్నదమ్ముల భాగాలు పంచుకొని దొనకొండ వదిలిపెట్టి కళ్యాణం కదిలిపోతే సంతానమి స్తానన్నాడు. మనం వెళ్లాల'''ని చెప్తది''. ''అన్నద మ్ములం కలిసిమెలిసి ఉంటున్నాం. ఏమంటున్నవు. నాకుకూడా కలలో కళ్యాణ సోమన్న కనిపించి మన ఆవుల మందలో అచ్చం పుట్టుగొడ్డు ఆవున్నది. అది కట్టి ఈనినట్లు నాకు కలలో చూపిస్తే నమ్ముతా'' అంటాడు పెద్దిరాజు. ఇదంతా గోడకు అతుక్కుని ఉన్న సోమన్న వింటున్నాడు. అప్పుడే మబ్బులు, మాయలు గావించి నిద్రపుచ్చాడు. అప్పుడు పుట్టుగొడ్డు ఆవుపై ఆంబోతు లేగ వాలినట్టు, అది సెల్ల పెయ్యిని బెట్టినట్టు, పాలు పితికినట్టు కలలో కనిపిస్తుంది. తరువాత మెలకువ వస్తుంది. అన్నదగ్గరికి వెళ్లిండు పెద్దిరాజు.
జరిగిన సంగతి చెబుతాడు. కళ్యాణం చాలా దూరంగా ఉంది. కాశికి పోయిన కాకే మరలలేదు. మున్నూట ముప్పరు ఆమడ. నువ్వు వెళ్లనెన్నడు, రానెన్నడు, సంతానం తీసుకొనుడెన్నడు? వద్దు తమ్మి వద్దు. మన అన్నదమ్ముల పిల్లల్లో ఎవరినొకరిని సాదుకో అన్నాడు. లేదన్నయ్యా.. తాలైన తప్పయిన తన పంట పండాలి. కుంటయిన, గుడ్డయిన గూనయిన తన కడుపు పండాలి అంటాడు. ఎంత చెప్పినా వినకపోయేసరికి ఆస్తుల పంపకానికి సిద్ధమయ్యారు.
సవాలక్ష ఆవుల మంద, నాన్న సంపాదించిన ధన ప్పెట్టెలు మూడున్నాయి. ఈయన పరిపాలన చేయడం దగ్గరి నుంచి సంపాదించినవి మూడు పెట్టెలున్నాయి. ''పాలి భాగాలు పెట్టడం నాతోటి కాదు. మనకందరికీ కావలసిన చుట్టం అల్లుడు బలిగొండరాజును పిలిపిద్దామ''ని పిలిపించారు. బలిగొండరాజు వచ్చి ఎవరి దొడ్లు వాళ్లు కావించు కొండి. సవాలక్ష ఆవులను ఒక చోట తోలండి అన్నాడు. ఆతర్వాత కక్షపాల ఊబిడి కైమంతరించి మందమీద జల్లాడు. వెంటనే పంచినట్టుగా ఎవరి దొడ్లోకి వెళ్లే ఆవులు వాళ్ల దొడ్లోకి పొయ్యాయట. ఆ తర్వాత ఒక్కొక్కరి దొడ్డిదగ్గరికి వెళ్లి ఎవరికి ఎట్లా వచ్చినయ్యో చూడటానికి వెళ్లారట. పెద్దిరాజుకు తప్ప మిగతా అన్నదమ్ములందరికీ మంచి ఆవులు, కోడెలు వచ్చాయంట. పెద్దిరాజుకు మాత్రం ముసలి ఆవులు, పుట్టుగొడ్డు ఆవులు, కుంటివి, గూనివి... అట్లాంటివి వచ్చినయ్యంట.
ఆరు ధనప్పెట్టెలు గంగమ్మ గుడిదగ్గర పెట్టి పంచు తున్నరు. అప్పుడు ఆడపిల్ల కొమరమ్మ చూసిందంట. ఆమెకూడా అక్కడికి వచ్చింది. ఆమెకోసం సింహాద్రి అప్పటికే సవాలక్ష గోవుల మందలో అరవై సెలపెయ్యలు, ఆంబోతు, కోడెలను పక్కన పెట్టించాడు. ధనప్పెట్టెలు ఆడపిల్లకొకటి ఇచ్చి మిగిలినవి తలా ఒకటి తీసుకు న్నారు. పెంద్దిరాజుకు ఆ పెట్టెలో పుట్టు అంగీలు, కవుష్కెలు, గోలీలు లాంటి ఇత్తడిపుత్తడి వంటివి వస్తే మిగతావారికి మంచి మంచి బంగారం, వెండి, డబ్బు వస్తుంది. ఆవులను కాసేవాళ్లను పంచితే అందరికి మంచోళ్లు వెళితే పెద్దిరాజుకి గుడ్డోళ్లు, కుంటోళ్లు, గూనోళ్లు వచ్చిండ్రు. దొనకొండ పట్టణం వదిలిపెట్టి కళ్యాణం కదులు తారు. కళ్యాణం పొయ్యే బాట మొత్తం లంక పెరిగి ఉంటుంది. అయిలు బొయిలు ఎంత కొట్టినా లంక పెరుగుతా ఉందంట. ఎంత సాఫీ చేసినా ఆవుల మంద ముందుకెళ్లలేక పోతున్నది. కొట్టి కొట్టి అరిష్టపడి ఉన్నారు. రాజా ఇక మాతోటి కాదని అన్నారట. ఇక పెద్దిరాజు భూబాణం వేశాడట. అది మార్గమధ్యంలో ఉన్న చెట్లను సంహరించుకుంటూ పోతు న్నదట. ఒకచోట ఒక మఱ్ఱి వృక్షం కింద ఏడుగురు మునిరాజులు తపస్సు పట్టి ఉన్నారు. ఈ భూబాణం ఏడుగురి తలపండ్లను సంహరించగా ఆ తల పండ్లు ఎగిరి కిందపడుతూ ''అరే రాజా ఎవ్హడివిరా నీవు? నీవు పోయినంత దూరాన మాశిరస్సులెట్ల ఖండించిందో నిన్నట్ల ఖండించే వాడుంటాడ్రా'' అన్నాయట. ఆ మాట విని పెద్దిరాజు గుండెలు గుభిల్లుమన్నాయి. అయ్యో పాపం చేశానే అనుకుంటూ ఏడుగురికి ఏడు అగ్నిగుండాలు కావించి, ఏడు కాష్టాలు పేర్చి కాలబెట్టి ఏడుగురికి ఏడు జిరుపెల్లెలు గట్టి, అక్కడ గుండుకు గుర్తుబడ రాసిండంట. ఏమని... ''వరరాజు వంశాన వలరాజు కలడు. ఆ వలరాజు భార్య వల్లమాదేవి. వల్లమాదేవి కుమారులు అయిదుగురు. అయిదుగురులో నలుగురికి సంతానమున్నది.
రెండోవాడైన పెద్ది రాజు సంతానం లేక దొనకొండను వదిలిపెట్టి కళ్యాణానికి కదిలిపోతుండగా ఈ సంఘటన జరిగింద''ని రాసిపెట్టి వెళ్లిండట. ఎవరన్నా తన పాలోల్లొస్తే దారి దొరకాలని ఇట్ల రాసిండట. ముత్యమంత గుడ్డలో పవడమంత సద్దిగట్టి ఆయొక్క తిరుపిల్లలు పెట్టి వెళ్లిండట. మావా ళ్లొచ్చి పట్టుకొంటే ఇప్పుడే వండిన పరమాణ్ణం కావాలని, పాలోళ్లు వచ్చి పట్టు కుంటే పాచిపో యిన అన్నం కావా లని దీవనార్తి పెట్టి వెళ్లిపోతాడు.
అట్ల వెళుతుండ గా పెద్ది రాజును పన్నెండు శిరస్సుల పాము కాటేస్తది. అప్పుడు ఆయన మూర్ఛిల్లుతాడు. అప్పుడు రెండు గండబేరుండ పక్షులు శివుని దగ్గరకు వెళ్లి ఆయన్ని లేపాలని అడుగ తయి. శివుడు అమృతభాండం ఇస్తాడు. అమృతం తీసుకు వచ్చి కొమ్మల నుంచి పోస్తారు. అది పెదవుల మీద పడగానే విషం విరిగిపోయి లేచి కూర్చుంటాడు. మళ్లీ ప్రయాణమవుతాడు. ఇటా ్లఅనేక బాధలు పడుతూ కళ్యాణం వైపు సాగుతుంటే... ఆవుల మంద మెరుగవు తుంది. గోవులు పాలిస్తుంటాయి. అయిలు బొయిలు కూడా మంచోళ్లయిపోయిండ్రు. చివరికి కళ్యాణం చేరుకుంటారు. అక్కడ ముదిరాజ్ వాళ్లు రాజ్యపాలన చేస్తుంటారు. మందలను నిలుపుకోవడానికి, తాను ఉండటానికి వారి దగ్గర అనుమతి తీసుకుంటాడు పెద్దిరాజు. తర్వాత స్వామి గుడి దగ్గరకు వెళ్లి శుభ్రం చేసి పూజచేస్తుండగా స్వామి ప్రత్యక్షమయిండట. ''నీలగుండము, పాలగుండము, రక్త గుండం మూడు గుండాలు కావించాలి. మీ పాపాలన్నీ తొలిగిపో వాలంటే ఆ గుండాల్లో స్నానం చేయాలి. స్నానం చేసి నాకు పూజలు పెట్టుకుంటే నీకు సంతాన ఫలం ఇస్తా అని చెప్పిండట. పాలన్నీ పిండి పాలగుండం చేసిండ్రట. నీళ్లు పోసి నీళ్ల గుండం చేసిండ్రు. ఇక రక్త గుండం కావాలి. మరి అంత రక్తం ఎక్కడి నుంచి వస్తుందని స్వామిని అడిగితే ... భూకేతరాజు పట్టణం వెళితే అక్కడ రెండువేల పక్షులుంటాయి. రాజు వాటిని పెంచుకుంటున్నాడు. ఆ గండబేరుండం పక్షి ఈక పీకితే ఇరవైపుట్ల రక్తం వెళ్తుంది. ఆరక్తాన్ని గుండంలో గావించుకొని మళ్లీ తన పక్షులు తనకు పంపించేసెరు అని చెబుతాడు. స్వామిచెప్పినట్లే చేయడంతో కొడుకు కాటమరాజును ఇస్తాడు. ఒక్క కొడుకేనా స్వామి అని అడగటంతో బిడ్డ పాపమ్మను కూడా ఇస్తడు. ఆ వూళ్లో సంతానం లేనివాళ్లు వచ్చి మాకు కూడా సంతానం కావాలి. నీవు కట్టిన పూజలు చెప్పమని అడుగుతారు. అంత కష్టం మీరు పడలేరని చెప్పి గుండాల పూజ గురించి చెబుతాడు పెద్దిరాజు. గండబేరుండ పక్షులు నువ్వే తీసుకురమ్మని వారు కోరడంతో సరే అని తీసుకువస్తాడు. అయితే రెండోసారి రక్తం తీసిన తరువాత ఆ పక్షులు సరిగా ఎగరలేక కష్టపడుతూ వెళుతూ ఉంటాయి. అప్పుడు ఏకలవ్యుడు అనే ఎరుకలవాడు సూటిబెట్టి సంహరిస్తాడు.
భూకేతరాజు తన పక్షులను చంపినది పెదరాజేనని యుద్ధా నికి వస్తాడు. ఇద్దరూ యుద్ధం చేసుకుంటారు. కానీ ఎవరికీ దెబ్బలు తగలవు. ఇద్దరూ తమ ప్రాణాలు ఎక్కడున్నాయో ఎదుటివారికి చెప్పుకొని మగాడవైతే చంపమని సవాల్ విసురుకుంటారు. పెద్దిరాజు తన ఆయుష్షు అరికాలు పుట్టుమచ్చలో ఉందని చెబు తాడు. కానీ భూకేతరాజు మాత్రం తన ఆయుష్షు ఎక్కడు న్నదో చెప్పకుండా అబద్ధం చెబుతాడు. భూకేత రాజు భూమి కింద నుంచి బాణం వేస్తాడు. అప్పుడు అరికాలు పుట్టుమచ్చలో దిగుతది. దీంతో పెద్దిరాజు ప్రాణం పోతది. అప్పటికే కాస్త పెద్దవాడైన కొడుకు కాటమరాజు ఆయన శవాన్ని కావడి కట్టుకొని తీసుకువెళ్లి మల్లిఖార్జున స్వామి ఆలయం ముందు కాష్టం పెట్టి ఆహుతి చేస్తుంటాడు. అప్పుడు పెద్దమ్మ ''సంతానం కోసం ఇంతదూరం వచ్చినా. సంతానం కలిగింది.భర్తను చంపుకునిపోయి నా బావల మొకం ఏవిధంగా చూడాలి, నా మరుదుల మొకం ఏవిధంగా చూడాలి. నేనుకూడా ఈ కాష్టంలోనే చనిపోతా''నని చెప్పేసి కొడుకు కాటమరాజును, కూతురు పాపమ్మను ముదిరాజ్ వాళ్లకిచ్చి కాష్టంలోనే కాలి చనిపోతది. చనిపోబోయే ముందు ''మా పిల్లల్ని అప్పగించమని మావోళ్లెవరన్నా వస్తే ఈ కాష్టం కాలుతున్న చోటుకు వచ్చి వాళ్ల పేర్లు చెప్పి నిలబడితే ఇప్పుడెట్లయితే కాలుతుందో అప్పుడూ అట్లనే కాలుతుంది. ఆ కాలే కాష్టంలో నా హస్తం చూపిస్తా. అప్పుడు మీరు నమ్మి మా పిల్లల్ని వారికి అప్పగించండి.వేరే పోలోళ్లో, పగోళ్లో వస్తే మేం అట్లా కనిపించం. వాళ్లకివ్వొద్దు'' అని చెబుతుంది. ఇది జరిగిన తరువాత పెద్దిరాజు తమ్ముని కుమారుడు వెతుక్కుంటూ వస్తాడు. ఈ జాడ తెలుసుకున్న తరువాత అందరూ ఆ కాష్టం దగ్గరికి వస్తారు.దణ్ణంపెట్టి తమ పేర్లు చెప్పడంతో చితి మంటల్లో హస్తం కనిపిస్తుంది. దీంతో కాటమరాజు, పాపమ్మలను ముదిరాజులు వారికి అప్పగిస్తారు.
-జి.శివరామకృష్ణయ్య
Authorization