ఫిబ్రవరి 16, 17 తేదీల్లో హైదరాబాదు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, సిఎస్టిడి బిల్డింగ్లో మధ్యయుగం చివరి భాగంలోని దక్కన్ రాజ్యాలకు, ఇరాన్ కి మధ్య ఉన్న సంబంధాలపై అంతర్జాతీయ సదస్సు జరుగుతుందని హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న 'దక్కన్ హిస్టరి సొసైటీ' జనరల్ సెక్రెటరీ ప్రొ. సైయద్ అయూబ్ అలీ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇది తాము నిర్వహిస్తున్న ద్వితీయ అంతర్జాతీయ సదస్సు అని, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చరిత్ర శాఖ, ముంబయిలోని ఇరాన్ కల్చర్ హౌస్తో కలిసి ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 'సోషియో పొలిటికల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ రిలేషన్స్ ఆఫ్ దక్కన్ స్టేట్స్ విత్ ది రూలర్స్ ఆఫ్ ఇరాన్ ఫ్రం 14 టు 18 సెంచరి' అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ ఇంటర్నేషనల్ సెమినార్కి ఇరాన్, టర్కీ దేశాల నుంచేకాక, ఇండియాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పరిశోధకులు వచ్చి తమ పరిశోధనా పత్రాలు సమర్పించనున్నారు. అట్లాగే ప్రొ.బషీరుద్దిన్ స్మారక ఉపన్యాసాన్ని న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామిక్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యుడు ప్రొ.ఎస్.ఎమ్. అజీజుద్దీన్ హెస్సేన్ ఇస్తారని, 'దక్కన్ సమాజంపై సూఫీ ప్రభావం' అన్న ది ఆయన ఉపన్యాస అంశమని, దక్కన్ చరిత్ర, సంస్కృతులపై ఆసక్తి ఉన్నవారందరూ ఈ సదస్సుకు రావచ్చని ప్రొ.అయూబ్ అలీ తెలియజేశారు.
Authorization