ఆఫ్రికాలో మొదటి తరం మానవులు హోమో సెపియన్స్ అవశేషాలు దొరికన ఓమో లోయలో ఇప్పటికీ అతి ప్రాచీన పద్ధతుల్లోనే జనం నివసిస్తున్నారు. వారి జీవన శైలిలో అత్యంత ఆసక్తిని రేకెత్తించేది రంగులతో శరీరాన్ని అలంకరించుకోవటం. దాదాపు పది లక్షల ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలోనే నివసిస్తున్న కొన్ని తెగలు ప్రకృతిలో దొరికే రంగు రాళ్ళను, మట్టిని, ఇతర మినరల్ రాక్స్ను మెత్తగా పొడి చేసి శరీరాలకు పూసుకుంటూ వస్తున్నారు. ఇథియోపియా, సూడాన్, కెన్యా దేశాల్లో విస్తరించిన ఓమో లోయలో దాదాపు ఐదు అక్షల మంది ప్రాచీన అటవిక తెగలకు చెందిన జనం జీవిస్తున్నారు. ఈ ఆటవికులు వేసవి కాలంలో పశువులను మేపుకుంటూ నదులు, సరస్సులు ఉన్న ప్రాంతానికి వెళతారు. కానీ వర్షాలు ప్రారంభమైన వెంటనే తిరిగి తమ గడ్డిభూములకు చేరుకుంటారు. యువకులకు, పిల్లలకు పశువులను మేపే బాధ్యతను అప్పగిస్తారు.ఎరట్రి ఎండలో పశువులతో తిరిగే వీరు... ప్రమాదకరమైన సూర్య కిరణాల నుంచి శరీరాలను రక్షించుకోవటానికి తాము మెత్తగా దంచుకున్న రంగురంగుల మట్టిని శరీరంపై దట్టంగా పూసుకుంటారు. పుణ్యం, పురుషార్థం దక్కేలా శరీరానికి పూసుకునే మట్టి రంగును నిర్ణయిస్తారు. ఒక్కో రంగుకు ఒక్కో తెగలో ప్రత్యేకమైన ప్రాధాన్యత, పవిత్రత ఉంటాయి. తమ దేవత, తమ తెగ, జంతువును సూచించే రంగులనే ఆయా తెగల వారు పూసుకుంటారు. కొన్ని రంగులు పూసుకుంటే దయ్యం, భూతం వంటి అతీత శక్తులు పారిపోతాయని వారు నమ్ముతారు. అలాగే ఈ రంగులతో శరీరాన్ని అలంకరించుకోవటంలో స్త్రీ పురుషులు పరస్పరం ఆకర్షించుకునే ప్రయోజనమూ ఇమిడి ఉంటుంది. ఇన్ని రకాలుగా వీరి సంస్కృతిలో బాడీ పెయింటింగ్స్ భాగమయ్యాయి కాబట్టే లక్షల ఏళ్ళు గడుస్తున్నా వారిని వీడకుండా కొనసాగుతూ వస్తున్నాయిు.
Authorization