రిచెనవూ ద్వీపంలో కనిపిస్తున్న ఈ సుందర దృశ్యం ఎందరో యాత్రికుల్ని ఆకర్షిస్తున్నది. ఇక్కడ కనిపిస్తున్న పూలతోటలోని చర్చిపేరు మినిస్టర్ సెంట్ మరియా ఉండ్ మార్కస్. ఒకప్పుడు ఇది చాలా ప్రాముఖ్యం ఉన్న చర్చి. ఈ చర్చి ఉన్న రిచెనవూ ద్వీపాన్ని ఐక్యరాజ్యసమితి కి చెందిన యునెస్కో ప్రపంచవారసత్వ స్థలంగా గుర్తించింది. అందువల్ల 2000 సంవత్సరం నుంచి ప్రపంచ పర్యాటక పటంలో దీనికి ప్రాముఖ్యం పెరిగింది. ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు చక్కని తోటలు పెంచడానికి అనువైనది. ఈ ద్వీపంలోని మూడోవంతు భూముల్లో వ్యవసాయం చేస్తారు. ఈ ద్వీపాన్ని తరచుగా 'వెజిటబుల్ ఐలాండ్' (కూరగాయల ద్వీపం) అని కూడా పిలుస్తూ ఉంటారు. జర్మనీ పశ్చిమ భాగంలో ఉన్న రిచెనవూ యాత్రికులకు ప్రీతిపాత్రంగా మారింది.