బస్తర్ ఆదివాసీలు సాధారణంగా పోడు వ్యవసాయం చేస్తారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒకప్పటి బస్తర్ జిల్లా కేరళ రాష్ట్రం కంటే కూడా విస్తీర్ణంలో పెద్దది. తర్వాత కాలంలో దానిని నాలుగు జిల్లాలుగా విడగొట్టారు.
ఈ పోడు సాగు ద్వారా ఎక్కువగా కొర్రలను పండిస్తారు. మనకు బియ్యం లాగా వారికి కొర్రలు ప్రధాన ఆహారం. ఈ పోడు సాగు కోసం ఓ ఏడెనిది ఎకరాల అడవిని నరుకుతారు. ఒక ఏడాది అలాగే వదిలేస్తారు. ఆ తర్వాత దానికి నిప్పు పెడతారు. ఎండిన మొద్దులన్నీ కాలి పోతాయి.
వేసవిలో అడవి ఎక్కడో ఒకచోట తగలబడుతూనే ఉంటుంది. అడవి తగలబడటం సహజ ప్రక్రియగానే ఉంటుంది. అలా తగలబడకపోతే ఏండ్ల తరబడి రాలిన ఆకులు, ఏటా కురిసే వర్షాలతో మురిగి పోయి అడవి మురుగు వాసన వేస్తదేమో కూడా. ఎండిన ఆకులతోపాటు బతికున్న చెట్ల ఆకులు కూడా కాలిపోతాయి కానీ, వానలు పడగానే మళ్లీ చిగురుస్తాయి. అడవి కాలుతున్న సమయంలో జంతువులు దూరంగా పారిపోతాయి. వాగులు, కాలువలు వచ్చిన చోట అడవి తగలబడటం ఆగిపోతుంది. కొన్నిసార్లు గాలికి నిప్పురవ్వలు అవతలికి ఎగిసిపడి అవతలా కాలిపోతుంది.
ఆ తర్వాత వర్షాకాలంలో కొర్రలను చల్లుతారు. కలుపు తియ్యరు. కాబట్టి పంట దిగుబడి తక్కువ. అదీగాక ఏడాదికి ఒక పంటే. కొందరు చదును ప్రారతంలో, నీటి కుంటలకు దగ్గర్లో కొంత వరి వేస్తారు. కానీ వర్షాధార పంట కావడం, దీంట్లోనే కలుపు తియ్యకపోవడం వల్ల తక్కువ పంట వస్తది. అదికూడా నీటికి దగ్గర్లో కొంత ఎక్కువగా దూరంగా ఉన్న మొక్కలకు తక్కవగా పరట వస్తది.
ఈ కొంచెం ధాన్యం ఏడాది పొడుగూతా తినడానికి సరిపోదు. అరదువల్ల దానిని కూడా లిమిట్గానే తింటారు. ఎక్కువగా రాగులు, మొక్కజొన్నలతో చేసుకున్న జావ మీదనే ఆధారపడతారు.
అట్లాగే దుంపలను ఎక్కువగా పెంచుతారు. దుంపలంటే భూమిలోనే అనుకుంటాం కానీ కొన్ని రకాల తీగలకు దుంపలు కాస్తాయి. వాటిని తిరటారు. చిలగడ దుంపలను బాగా పండిస్తారు.
అడవిలో రకరకాల ఆకులతో కూరలను వండుతారు. బెండకాయలను బస్తర్ అడవిలో నేను ఎన్నడూ చూడలేదు. ఇతర రాష్ట్రాల బార్డర్ గ్రామాల్లో ఉంటాయి కావచ్చు. ఎవరి ఇళ్ల చుట్టూ వాళ్లు కూరగాయల మొక్కలను పెంచుకురటారు. కూరగాయలను కొనడం, అమ్మడం తెలియదు.
గార నూనె తయారు చేసుకురటారు. ఈ నూనె చేదుగా ఉంటది. అయితే పొగలు వచ్చేలా నూనె కాగిన తర్వాత అరదులో కొన్ని నీటి చుక్కలను విదిల్చుతారు. అప్పుడు కూరగాయలను వేసి వండుతారు. ఈ నూనె కూడా చాలా చాలా తక్కువ మొత్తంలో వేస్తారు.
పొప్పడికాయ కూరను ఎక్కువగా వండుతారు. పొప్పడికాయ కూర తింటే అబార్షన్ అవుతది అని బయట అరటురటారు. కానీ వాళ్లు ఎప్పుడైనా పొప్పడికాయ కూరను నిర్భయంగా తింటారు. బాగానే ఉంటారు. అన్నం కంటే కూరను ఎక్కువగా తింటారు. డొప్పడు జావ తాగితే డొప్పడు కూర తింటారు.
శారీరక కష్టమూ, ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు ఆదివాసీల్లో లావుగా ఉన్నవాళ్లు కనిపించరు. కర్ర పట్టుకుని నడిచే ముసలివారు కూడా ఖాళీగా కూర్చోరు. ఏదో ఒక పని చేస్తనే ఉంటరు.
వేట, ఆహార సేకరణ, పంటలను వేసేముందు, కోసేముందు చేసే పండుగలు, ఉత్సవాలు గురించి రాయాలంటే అనేక వ్యాసాల పరంపర అవుతుంది.
Authorization