అనేది భారతీయ సంప్రదాయ నృత్యాల్లో ఒకటి గొటిపువా. ఇది ఒడిషా రాష్ట్రంలో పుట్టి అభివృద్ధి చెందింది. వందల ఏండ్లుగా దీన్ని ప్రదర్శిస్తున్నారు. అబ్బాయిలు... అమ్మాయిల వేషం వేసుకుని ఈ నాట్యం చేయడం దీనిలోని ప్రత్యేకత. స్త్రీ వేషం ధరించిన బాలురు జగన్నాథుని, కృష్ణుని స్తుతిస్తూ నాట్యం చేయడం గొటిపువా ఇతివృత్తం. కొంతమంది బాలురు బృందంగా ఏర్పడి రకరకాల సాహస విన్యాసాలు ప్రదర్శిస్తూ రాధాకృష్ణుల జీవిత కథను ప్రదర్శిస్తారు. అతి చిన్న వయసులో ఈ నాట్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించి యవ్వన దశ వరకు నేర్చుకుంటూనే ఉంటారు. రఘురాజ్పుర అనే ఊరు ఈ నాట్య బృందాలకు పేరుగాంచింది.
అచ్చం ఆడపిల్లల్లా కనిపించడం కోసం చిన్నప్పటి నుంచి జుట్టు కత్తిరించకుండా పెంచుతూనే ఉంటారు. చక్కగా జుట్టు ముడివేసుకొని పూలచెండులు ధరిస్తారు. ఎరుపు, తెలుపు పౌడర్లను కలిపి ముఖానికి పూసుకుంటారు. ఆట్లాగే కంటి చుట్టూతా కాటుకను దిద్దుకుని కళ్లు పెద్దవిగా కనిపించేలా చేస్తారు. నుదుట ఎర్రటి బొట్టు పెట్టుకొని దాని చుట్టూ గంధంతో డిజైన్ చేస్తారు. అట్లాగే ముఖాన్ని సంప్రదాయ పెయింటింగ్స్తో అలంకరిస్తారు.
గొటిపువా నృత్యాన్ని చేసేవారు ధరించే సంప్రదాయ దుస్తులను 'కంచులా' అంటారు. ముదురు రంగు జాకెట్పై మెరిసే అలంకరణలు ఉంటాయి. అట్లానే సిల్క్ బట్టను నడుము చుట్టూ, కాళ్ల చుట్టూ ధరిస్తారు. వీరు పూసలతో ప్రత్యేకంగా తయారుచేసిన ఆభరణాలను ధరిస్తారు. కంఠహారాలు, బ్ర్రేస్లెట్స్, చెవికి పెట్టుకునే ఆభరణాలు, కాళ్లకు కట్టుకునే గజ్జెలు ప్రదర్శనదారులు ధరిస్తారు.
Authorization