సైబీరియా - 50 డిగ్రీల చలినుంచి మంచుకొండలతో గడ్డకట్టిన బైకుల్ చెరువుతో అందమైన లోయలతో నదులతో చూడముచ్చటగా వుంది. సైబీరియా ఒక వైపు పర్వతశ్రేణి, ఉత్తరాన అర్కిటిక్ సముద్రం, దక్షిణాన కజక్ స్టెఫే అల్టాయి శిఖరాలలో విస్తరించి వుంది. ఇక్కడ సోవియట్ జియాలజిస్టు 1978లో మనుషుల సంచారం లేని ప్రాంతాన్ని కనుగొన్నారు. ఆర్కిటిక్, అతి చల్లని గాలుల మీదుగా ఐస్ బంతులను స్థానికులు సైబీరియా బీచ్లో చూశారట. సైబీరియాలోని బైకల్ లేక్ని (మదర్ ఆఫ్ పిరల్) అని కూడా పిలుస్తారట. నికోలస్ మాస్లవ్ ఒక బుక్ రాశారు. ఈయన సైబీరియా గురించి బ్లాక్, బిట్టర్, బ్యూటిఫుల్ అని రాశారు. రష్యాలో భాగమైన అలాస్కాని అమెరికా వారికి 1867, మార్చి 30న 1.5 మిలియన్ హెక్టారుని 7.2 మిలియన్స్కు అమ్మారు. రెండు సెంట్లు ఎకరం లెక్కన అమ్మారు. రష్యన్ రాజు అలెగ్జాండర్ అమ్మారు.
ట్రాస్స్ సైబీరియన్ అంటే ఏమిటి? ఇది రష్యా (మాస్కో) నుండి మంగోలియా, చైనాకి వెళ్ళే రైలును ట్రాన్స్ సైబీరియా అంటారు. మొత్తం ప్రపంచంలో వున్న రైలు ప్రయాణాలతో పోలిస్తే ఈ రైలు ప్రయాణాన్ని ఒక వజ్ర కిరీటంలాంటిది. దీని గొప్పతనం ఏమిటి అంటే ఏడు సార్లు ప్రయాణిస్తే మన టైమ్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఈ రైలు మాస్కో యూరోపియన్ రష్యా, పసిఫిక్ అంచున వున్న ఆసియా దేశాల్ని తాకుతూ ప్రయాణిస్తుంది. ఎన్నెన్నో యుద్ధాలు వచ్చినా, తుపాన్లు వచ్చినా, 50 డిగ్రీల మంచుగడ్డలతో వున్నా ఈ రైలు పట్టాలు చెక్కు చెదరలేదు. అది దీని గొప్పతనం. ఇది ఐస్ చెరువు బైకాల్ లేక్ని మంగోలియా, గోబి ఎడారిని ప్రపంచంలోనే వింతైన చైనా గోడని అన్ని రకాల ఉష్ణశీతల వాతావరణాన్ని ఈ రైలులో చూడవచ్చు. మాస్కో నుండి బయలుదేరి చైనాలోని గ్రేట్వాల్ వరకు ప్రయాణిస్తుంది. ఆరు రోజుల సుదీర్ఘ ప్రయాణం. అది ఎక్కడ ఆగకుండా వెళితే అన్ని స్టేషన్స్లో ఆగుతూ చూస్తూ వెళితే మూడు వారాలు పడుతుంది. మేం పది రోజులు అక్కడే ఉండి సెయింట్ పీటర్స్ బర్గ్ మాస్కో కూడా చూశాం.
అందుకని ఈ సారి మేం మా ప్రయాణం ఇర్క్టుస్క్ నుండి సైబీరియన్ ట్రైన్లో బయలుదేరాలని అనుకున్నాం. ఇర్క్టుస్క్ రష్యాలోని ఒక భాగం. ట్రాన్స్ సైబీరియా రైలులో మంగోలియా, గోబి ఎడారి, బీజింగ్, లాంజో జాంగీ దాక్సియా ఈ స్థలాలన్నీ చూడాలని నిర్ణయించుకున్నాం. ఫర్బిడెన్సిటీ, గ్రేట్వాల్ ఆఫ్ చైనా ఇంతకు ముందే చూశాం. అందుకని ఈ ప్రయాణంలో 3 దేశాలు రష్యా మంగోలియా, చైనా చూడాలని అనుకున్నాం. మేం ఇర్క్టుస్క్కు హైదరాబాద్ నుండి బ్యాంకాక్, బ్యాంకాక్ నుండి ఇర్క్టుస్క్కు బయలు దేరాం. ఏ ఎయిర్లైన్ చూచినా 22 గంటలు 36 గంటలు వున్నాయి. అందుకని మేం బ్యాంకాక్లో ఒక రోజు ఆగి అక్కడి నుండి రెండవ రోజు బయలుదేరాం. ఇర్క్టుస్క్ ఆరు గంటల ప్రయాణం. మేం ఇర్క్టుస్క్కు ఐదు గంటలకు చేరాం. ఇర్క్టస్క్లో డాలర్ నుండి రూబెల్స్కు కరెన్సీ మార్పిడి చేసుకున్నాం. ఇక్కడి రూబెల్స్ 1.20 పైసలుతో సమానం. అక్కడ ట్యాక్సీ తీసుకొని ముందుగా బుక్ చేసుకున్న హోటల్కు వెళ్ళాం. ఏడు గంటలు అయ్యింది. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఆ రోజు సిటీ టూర్ తీసుకున్నాం. ఆ సిటీ టూర్కి ఒక ఇంగ్లీష్ గైడ్ డ్రైవర్ ఒక వ్యాన్ తీసుకొని వచ్చారు. మేం ఈ గైడుతో పాటు రైల్వేస్టేషన్కు వెళ్ళి ట్రాన్స్ సైబీరియన్ ట్రైయిన్ టికెట్స్ కొనుక్కున్నాం. ఈ ట్రాన్స్ సైబీరియన్ ట్రైన్లో మూడు రోజుల కొరకు టికెట్ కొన్నాం. అక్కడి నుండి ఆ సిటీ టూర్కి బయలు దేరాం.
పాత పుస్తకాలలో ఇర్క్టుస్క్ని ''సైబీరియన్ పారిస్'' అంటారు. కొంతమంది బ్లాగర్స్ దీన్ని ''బార్సెలోన'' అని రాశారు. ఇర్క్టుస్క్లో మొదట ''మాస్కో గేట్స్'' ని చూశాం. ఇది పూర్వకాలం నుంచి యాత్రికులకు, వ్యాపారస్తులకు మంచి మార్గం. క్యాథ్డ్రల్ ఆఫ్ ద కజాన్ - ఇది ఆర్థొడాక్స్ చర్చి అవర్ లేడీ ఆఫ్ కజాన్ అని కూడా అంటారు. ఇది కాథలిక్ చర్చి. ఈ చర్చి గోపురాలు నీలిరంగు వేసిన గోపురములతో ఇటుక రంగు గోడలతో తెల్లని చిన్న చారలతో ఎంతో అద్బుతంగా కట్టారు. మేం ఇద్దరం ఫొటోదిగి అక్కడి నుండి బయటికి వచ్చాం. ఈ చర్చికి బయట ఒక కొలను వుంది. అందులో నల్లని హంస వుంది. అది పొడవైన మెడ ఎర్రటి ముక్కు మిగతా అంతా నల్లగా వుంది. ఇవి ఎక్కువగా న్యూజిలాండ్లో దొరుకుతాయి. ఈ నల్ల హంస ఆ కొలను లో ఈదుతూ ఆనందిస్తూ వుంది. అక్కడ ఫొటో దిగి వచ్చాం. ఈ చర్చి నిర్మించి మూడున్నర శతాబ్దాలయిన సందర్భంగా 13 సెప్టెంబర్ 2011న ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ చర్చిలో ముగ్గురు భక్తుల శవ పేటికలను స్టీల్తో తయారు చేసిన పెట్టెలలో పూడ్చి వుంచారట. వీరు 350 సంవత్సరాల క్రితం ఇర్క్టుస్క్ కోసం ప్రాణాలు వదిలారు. దాని చిహ్నంగా ఈ చర్చి కట్టారు. ఈ స్పాస్కాయా చర్చి రిపేరు చేస్తుండగా ఇది బయట పడింది.
అక్కడి నుండి బయటవున్న మైదానంలోకి వెళ్ళాం. ఈ మైదానంలో ఇద్దరి శిల్పాలు వున్నాయి. ఇవి సెయింట్ పీటర్, ఫెఫ్రోనియా మురమ్ ఇద్దరూ ఆర్థోడాక్స్ భక్తులు. వీరి విగ్రహాలు 2.8 మీటర్ల ఎత్తులో (రష్యాలోనే 9వ ఎతైన విగ్రహాలలో) తయారు చేసిన విగ్రహం. ఇక్కడ 350 సంవత్సరాల నుండి వెలుగుతున్న ఒక దీపం వుంది. ఇది ఎప్పుడూ ఆరిపోదు. ఇక్కడికి ఎన్నో కొత్తగా పెళ్ళి అయిన జంటలు వచ్చి వారి ముక్కుతో ఈ రాతిని రాస్తారు. (రబ్బింగ్ విత్ నోస్) ఇలా చేయడం చాలా అదృష్టమని చెప్పుకుంటారు.
ఇక్కడ ఒక చిన్న కథవుంది. పీటర్, ఫరోనియా అనే వారు ఈ ప్రదేశంలో ఎన్నో శతాబ్దాల క్రితం నివసించారు. వీరిద్దరూ ప్రేమికులు, కాని పీటరు సన్యాసిగా వీరిరువురిని ఒక మొనాస్ట్రీలో వాగ్దానాలు తీసుకున్నారు. అయితే వీళ్ళని ఒక ఖైదీఖానాలో వేరు వేరు గదులలో బంధించారు. ఒకే సమయంలో ఒకే రోజు ప్రాణాలు విడిచారు సన్యాసిగా వున్న వాళ్ళని ఒక్కొక్కరిని వేరు వేరు ప్రదేశాలలో పూడ్చి వేశారు. నిశ్చయించుకున్నారు. కాని రెండుసార్లు కూడా వీరి శవాలు మళ్ళీ ఒక్క చోట దర్శనం ఇచ్చారు. అప్పుడు ఇద్దరిని కలిపి ఒక పెట్టెలో పెట్టి పూడ్చారన్నది ప్రచారంలో ఉన్న కథ. ఇప్పటికీ ఎవ్వరైనా అస్వస్థతగా వుంటే ఒక్కడికి వెళ్ళి ప్రార్థిస్తే బాగవుతుందనే విశ్వాసం జనాల్లో ఉంది. అక్కడ ఆ యిద్దరి విగ్రహాలతో ఒక ఫొటో దాగాం. అక్కడి నుండి చక్కటి పూల తోటలతో ఉద్యానవనంలో విహరించాం. అంగారా నది ఒడ్డున ఈ ఉద్యానవనం సూర్యుడు అస్తమించే వేళ వెళ్ళాం. బంగారు వర్ణంలో ఆకాశం దానిని ప్రతిబిం బిస్తూ నది అలలు ఒక దానిని మించి ఒకటి పోటీ పడ్తున్నట్లుగా ఉంది. ఆ అం దాన్ని చూసి ఆనందించాం. ఇక్కడ నుండి నగరమంతా కనిపి స్తుంది. అక్కడే మరొక విగ్రహం ఉంది. బెలెబోర్డోవా అనే అతని విగ్రహం. ఇతను అఖినో అనే గ్రామంలో పుట్టి ఫ్రీడం పైటర్గా పేరు ప్రతిష్టలు పొందారు. 1944లో రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. 18 సోవియట్ అవార్డులతో ఇతనికి ''హానరబుల్ సిటిజన్ ఆఫ్ ఇర్క్టుస్క్'' అని బిరుదు ఇచ్చారు.
అక్కడి నుండి ఒక మ్యూజియంకు వెళ్ళాం. మ్యూజియంలో ఇర్క్టుస్క్ గురించి రష్యా గురించి యుద్ధం చేసిన వారి ఫొటోలు, వారు ఉపయోగించిన పరికరాలు ఉన్నాయి. అక్కడి నుండి ఒక వుడెన్ హౌజ్ అడ్మిన్స్ట్రేటివ్ బిల్డింగ్కు వెళ్ళాం. దానిని ఒక అంతస్థుతో చెక్కతో చేసిన ఇల్లు 1843లో దీనిని కట్టారు. చాలా మంది దీనిని ఒకరి తర్వాత ఒకరు కొన్నారు. 1907లో ఎ.ఐ. సస్టీన్ అనే వ్యాపారస్థుడు దీనిని కొన్నాడు. ఇతను మున్సిపల్ బిల్డింగ్ ప్రభు త్వా నికి ఇచ్చారు. దీనికి ''హౌస్ ఆఫ్ యూరోప్'' అని పేరు పెట్టారు. ఇది చాలా దృఢమైన చెక్కతో తయారు చేసిన గృహం. అప్పటి వాస్తుకళతో యూరప్ రష్యా అనుకరణలతో నిర్మించిన గృహం చాలా అందంగా వుంది. లేక్ బైకెల్ అనే పేరు మంగోలియా భాషలో అని అర్ధం.
ఇక్కడ నుండి ట్రెయిన్లో లేక్ బయకాల్ అనే చెరువుని చూడటానికి వెళ్ళాం. కురుగు బైకెల్ యస్కాయా రైల్వే ఇది త్రికోణం ఆకాటలో లేక్ చుట్టూ ప్రయాణంచేసే రైలు. ఇది ఎంతో అందమైన కొండలలో నీలిరంగు నీళ్ళతో ఈ లేక్ సూర్యుని కిరణాలు పడి వెండిని నీళ్ళపై పరిచినట్లు ఆలేత సూర్యుణ్ణి కిరణాలతో తళతళ మెరుస్తూ ఆ అందాన్ని చూచి మైమరచి పోయాం. కొండ అంచుభాగంలో ఎంతో పటిష్టంగా నిర్మించిన రైలు మార్గం. 424 ఇంజనీర్లతో నిర్మించిన కట్టడాలు, 39 గుహలలో 8994 మీటర్ల పొడవు 548మీటర్లు. దీన్ని మెటల్ గ్యాలరీస్తో కట్టారు. ఈ రైల్వేను ''గోల్డెన్ బక్కుల్ ఆఫ్ ద మెటల్ బెల్ట్ ఇన్ రష్యా'' అంటారు. ఇది ట్రైన్ సైబీరియన్ రైల్వే ఇర్క్టుస్క్ నుండి సైబీరియా రైలు పట్టాలకు 93000 రూబుల్స్ ఖర్చుపెట్టి ఈ ఒక్క రైలు మార్గానికి 130000 రూబుల్స్ ఖర్చుపెట్టారు. దీనిని ప్రపంచంలోనే అతి ప్రసిద్ధిచెందిన రైల్వే ట్రాక్గా చెబుతారు. ఇది ఒక రోజు మొత్తం 7 గంటలకి ట్రైన్ ఎక్కితే 5 గంటల వరకు మధ్య మధ్యలో ఆగుతూ అన్నీ అందమైన ప్రదేశాలని తిలకిస్తూ రైలు పట్టాలమీద పడుకొని ఫొటో దిగి, అక్కడి నుండి అన్నీ అందమైన కొండలు గుహలల్లో ప్రయాణిం చాం.
ఈ లేక్ బైకల్ క్రిస్టల్ క్లియర్ వాటర్ బ్లూ వాటర్. ఇందులో ఓముల్ అనే చేప దొరుకుతుంది. ఇది ఈ లేక్ ప్రత్యేకత. ఇది చాలా రుచిగా ఉంది. ఇక్కడ ఒక రిసార్ట్లో ఆ రాత్రి విశ్రమించాం. ఈ లేక్ని హౌలి సీ, హైలీ వాటర్ అని 17వ శతాబ్దం నుండి పిలుస్తున్నారు. ఇక్కడ మ్యూజియం ఈ బైకల్ లో ఎన్నో వేల రకాల స్పేసియస్ వున్నాయి. అక్కడి నుండి కేబుల్కార్లో ఆ పర్వతశ్రేణి అందాన్ని లేక్ అందాల్ని చూస్తూ ట్రెక్కిన్ చేశాం. అక్కడి నుండి వుడెన్ హౌసెస్ ఇది ఈవెంక్స్ అనే ఆదిమజాతి షమ్మాన్ అనే దేవుడిని కొలిచేవారు. వీరు సంచార జీవులు. వీరు ఆ కాలంలో ఉపయోగించిన వస్తువులు, ఆ వస్తువులతో పాటు వారు జీవించిన విధానం ఉట్టిపడేటట్టుగా వుంది. ఈ గ్రామంలో అన్నీ చెక్కతో తయారు చేసిన ఇండ్లు చాలా అందంగా వున్నాయి. సైబీరియన్ డైగా అనే జాతివారు జంతువులను వేటాడడానికి ఈ ప్రదేశంలో నివసించేవారు. ఇవన్నీ తిలకిస్తూ ఒక వుడెన్ ఊయలలో ఊగి ఆనందిస్తూ ఆనాడు 17వ శతాబ్దంలో చెక్కతో చేసిన ఇండ్లను చూస్తూ ఆనందించాం. మొత్తమ్మీద సైబీరియా పర్యటన మరిచిపోలేని ఆనందానుభూతుల్ని మిగిల్చింది. పర్యటనల పట్ల ఆసక్తి ఉన్న వారు జీవితంలో ఒక్కసారయినా సైబీరియన్ రైలులో ప్రయాణించడం బావుంటుంది.
- నర్మదరెడ్డి
9849018510
Authorization