అక్కడి ప్రకృతి అందాలను చూడటానికి రెండు కండ్లు చాలవు. ఎటు చూసినా చుట్టూ పచ్చదనమే కనిపిస్తుంది. కొండలు, గుట్టలు, పర్వతాలు... రంగురంగుల పూల సువాసనలు ఈ వ్యాలీ అంతటా వ్యాపించి ఉంటాయి. దక్షిణ భారత దేశంలో ఉన్న పూల లోయల్లో మరొకటి సతారా సమీపంలో ఉన్న కౌస్ మైదానం. ఈ అందమైన ప్రదేశం వరల్డ్ హేరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. వర్షాకాలం ఆరంభం నుంచి శీతాకాలం ముగింపు వరకు రంగు రంగుల పువ్వులతో ఈ లోయ పర్యాటకులను అబ్బుర పరుస్తుంది. మిక్కిమౌస్ పువ్వులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
మహారాష్ట్ర లోని సతారా జిల్లా 10,500 చ.కి.మీ ల విస్తీర్ణంలో నెలకొని ఉంది. దీనికి పడమటి వైపున రత్నగిరి, తూర్పున సోలాపూర్, దక్షిణాన సాంగ్లి ఉన్నాయి. దీని చుట్టూ కొండలు ఉండటం వల్ల సతారా అని పిలుస్తారు. అంటే సుమారుగా ఏడు కొండలు ఉంటాయి. ఆ ఏడు కొండల పేర్లను చూసినట్లైతే జరందేశ్వర్, యవతేశ్వర్, అజింక్యతర, కిట్లిచా దొంగార్, సజ్జనగడ, పెధ్యాచా బైరోబా, నడ్కిచా దొంగార్. సతారా చారిత్రక వైభవాన్ని గమనించినట్లైతే సతారా జిల్లాను ముందుగా రాష్ట్రకూట వంశస్తులు పాలించారు. వారి తర్వాత చాళుక్యులు, మౌర్య రాజులు పాలించారు. ముస్లిం దండయాత్ర తర్వాత సతారా మరాఠా నగరంగా మారింది. ఆ తర్వాత బ్రిటిష్ వారు సతారాను మరాఠాల నుంచి చేజిక్కించుకొని రాజా ప్రతాప సింహుడికి అప్పగించారు. అటు తర్వాత సతారా బొంబాయి ప్రెసిడెన్సీ లో భాగమైంది. ప్రకృతి ప్రేమికులు తప్పక చూడాల్సిన వివిధ జాతుల మొక్కలు ఇక్కడ దొరుకుతాయి. కౌస్ సరస్సు, కౌస్ మైదానంలో ఉండే పువ్వులు పర్యాటకులను అబ్బురపరుస్తాయి. ఇవే సతారాకు ప్రధాన జలవనరులు.
Authorization