గతం వర్తమానానికి చరిత్ర. వర్తమానం భవిష్యత్కు చరిత్ర. ఆ చరిత్రలో ఎత్తుపల్లాలు, స్వర్ణయుగాలు, క్షీణ దశలు అన్నీ ఉంటాయి. అలాంటి చరిత్రకు సంబంధించిన కట్టడాల గురించిన కథలు వినడం, చదవడం తప్ప ప్రత్యక్షంగా చూసినవారు చాలా అరుదుగా ఉంటారు. నిజంగా వాటిని చూసినప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. అపురూపమైన చారిత్రక కట్టడాలను, అద్భుతమైన శిల్పకళను, సాంకేతిక నైపుణ్యాన్ని తనలో దాచుకున్నది ''కోణార్క్ సూర్యదేవాలయం''. ఈ దేవాలయం చరిత్రను తన గర్భంలో దాచుకుంటే దాని చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి కటక్, భువనేశ్వర్, గోపాల్పూర్ బీచ్, ఉదయగిరి, చిల్కా సరస్సు, బెర్హంపూర్ బీచ్, సన్ రైజ్ హిల్స్ తదితర ప్రాంతాలు చరిత్రలో మౌనంగా నిలవడమే కాకుండా ప్రపంచ పర్యాటకులను తన దగ్గరకు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి.
ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. కోణార్క్ దేవాలయం. ఎర్ర ఇసుక రాయితో నిర్మించిన అద్భుత కట్టడం. ఇది పగటి పూట కురిసే వెన్నెల. అమావాస్య రాత్రుల్లో వెలిగే చందమామ. మానసిక ప్రశాంతతను ప్రసాదించే ఆధ్యాత్మిక క్షేత్రం. కాబట్టి దీన్ని ''నల్ల పగోడా'' అని కూడా పిలుస్తారు. అంతే కాదు సైన్స్, ఆధ్యాత్మికం కలగలిసిన అపురూపమైన నిర్మాణం. కళింగ రాజుల శిల్పకళా వైభవానికి ప్రతీక కోణార్క్ సూర్య దేవాలయం. ఒడిషాలోని మహానది నుంచి ఆంధ్రాలోని గోదావరికి మధ్య ఉన్న ప్రాంతమంతా ప్రాచీన కళింగ రాజ్యంగా ఉండేదని చరిత్ర చెబుతున్నది. ఇక్కడి సంస్కృతి కాస్త భిన్నంగా ఉంటుంది. ఒడిషా శిల్పసౌందర్యానికి కోణార్క్ ఓ చక్కటి ఉదాహరణ. కోణార్క్ సూర్య దేవాలయాన్ని1200 మంది శిల్పకళాకారులు, 12 ఏండ్ల పాటు కష్టపడి నిర్మించినారట. ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో పూర్తి చేశారు. ఇది చూడటానికి సూర్యరథంలా ఉంటుంది. పన్నెండు జతల చక్రాలు కలిగిన ఓ పెద్ద రథాన్ని ఏడు గుర్రలు లాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక్కొక్క రథ చక్రం మూడు మీటర్ల వ్యాసంతో, అందమైన నగిషీ చెక్కడాలతో కనిపిస్తుంది. కోణ అంటే కోణం. ఆర్క అంటే సూర్యుడు. సూర్య గమనానికి అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. రథానికి పన్నెండు చక్రాలు ఉంటాయి. అయితే సంవత్సరానికి పన్నెండు నెలలు. వీటి అనుగుణంగానే సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో ఒక్కో నెల జరుగుతుందని చెబుతారు.
పురావస్తు మ్యూజియం...
1968 లో ఇక్కడ పురావస్తు మ్యూజియాన్ని ప్రారం భించారు. సూర్య దేవాలయం సమీపంలోనే పురావస్తు మ్యూజియం ఉంది. దీన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వ ర్యంలో నడిపిస్తున్నారు. గత వైభవాన్ని తెలుసుకునేందుకు పర్యాటకులు ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వస్తారు. ఆలయంలో పడిపోయిన నిర్మాణాలను, పురావస్తు శిథిలాలను ఈ మ్యూజియంలోనే భద్రపరిచారు. వాటిని చూడడానికి కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా మ్యూజియంలో నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. ఆలయం నుంచి సేకరించిన 260 కి పైగా ప్రాచీన వస్తువులు, వివిధ విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి. వాటితో పాటు వివిధ రకాల ఇతర స్మారక చిహ్నాలు, కళింగ చరిత్రను వివరించే పురాతత్వ ప్రదేశాల చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ మ్యూజియాన్ని ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరుస్తారు. శుక్రవారం నాడు సెలవు. పర్యాటకులు ఈ విషయాన్ని దష్టిలో పెట్టుకుంటే మంచిది.
శాస్త్రీయ నృత్య వేడుకలు...
పర్యాటకులకు స్వర్గాధామం కోణార్క్. ప్రపంచ నలు మూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తున్నది. కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుండి 5 వరకు జరుగుతుంది. శాస్త్రీయ నత్య వేడుకలకు ఇది ప్రత్యేక ఆకర్షణ. ప్రాచీన నత్యాలైన ఒడిస్సీ, భరతనాట్యం, కథక్, కూచిపూడి, మణిపురి, స్థానిక ఛౌ డాన్సులు వేడుకలో ప్రదర్శిస్తారు. కోణార్క్ పర్యాటకం లో ప్రధాన ఆకర్షణ హస్త కళల మేళా. నోరూరించే వంటకాలు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటాయి. కోణార్క్ లో పెద్ద ఎత్తున జరిగే మరొక ముఖ్యమైన పండుగ చంద్రభాగ మేళా. ఇది ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. అలాగే కోణార్క్ లో షాపింగ్ మరో ప్రత్యేక ఆకర్షణ. కోణార్క్ లో ఉన్న కుటీర పరిశ్రమలో అల్లిన పందిళ్ళు, బ్యాగులు, గొడుగులు రంగు రంగుల్లో పర్యాటకులను అబ్బుర పరుస్తాయి. వివిధ చిత్రాలు, ఏనుగు దంతం, రాయి, చెక్కతో చెయ్యబడిన డెకరేటివ్ వస్తువులు, పెయింటింగ్స్ ఇక్కడ చాలా లభిస్తాయి.
ప్రత్యేకతలెన్నో...!
ఈరోజుకి కూడా వేలాది మంది సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ నిర్మాణం ఒకప్పుడు బౌద్ధధర్మానికి చెందింది. ప్రస్తుతం దీనిని అన్ని మతాలవారూ సందర్శిస్తున్నారని చరిత్ర స్పష్టం చేస్తోంది. ఎరుపు రంగు ఇసుక, నల్లటి రాళ్ళతో కట్టినందు వల్ల బ్రిటిష్ పాలనలో వారు దీన్ని 'బ్లాక్ పగోడా' అని వ్యవహరించేవారు. ఈ ఆలయాన్ని 1568లో బెంగాల్ సుల్తాన్ సులైమాన్ ఖాన్ కర్రాని నాశనం చేసాడు. ఆ సుల్తాన్ క్రింద జనరల్ కాలాపహాడ్ ఆధ్వర్యం లో మరోసారి కోణార్క్ సూర్య దేవాలయం విధ్వంసాన్ని చవిచూ సింది. తర్వాత పదిహేడవ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి జహంగీర్ ఈ కోణార్క్ ఆల యంలో మిగిలిన శిల్పాలను కొన్నింటిని నేల మట్టం చేశాడు. ఇప్పుడైతే ఏడు గుర్రాలలో, ఆరు గుర్రాలు మాత్రం శిథిలావస్థలో మిగిలివున్నాయి. అలాగే చాల చోట్ల విరిగి పోయిన శిల్పాలు ఇంకా చరిత్రను మాత్రం చెరపకుండా చూపిస్తున్నాయి. అంతే కాకుండా ఖజరహౌలో ఉన్నట్లే ఇక్కడ కూడా కొన్ని వందల శృంగార శిల్పాలు న్నాయి. ఇవి చూసే తాపీ ధర్మారావు ''దేవాల యాలపై బూతు బొమ్మలెందుకు?'' అనే పరిశోధనాత్మక పుస్తకాన్ని రాసారు. ఈ ఆలయంలో ఎలాంటి విగ్రహం, పూజలు లేకపోయినా, రథ సప్తమి నాడు మాత్రం ఉత్సవాలు జరపడం విశేషం. ప్రస్తుతం కోణార్క్ పురావస్తుశాఖ నిర్వహణలో ఉంది. ప్రపంచ వార సత్వ సంపదల్లో ఇదొకటిగా ఐక్యరాజ్య సమితి 1984లో దీనిని గుర్తించింది.
చిల్కా సరస్సు...
ఒడిషా లో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాలలో ఒకటి చిల్కా సరస్సు. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సరస్సుగా పేరుగాంచింది. ఇది భువనేశ్వర్ నుంచి 81 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిల్కా గంజాం జిల్లాలో, ఖుర్దా, పూరీ సరిహద్దుల వెంబడి ఉంటుంది. కళింగ రాజుల పాలనలో చిల్కా వాణిజ్య కేంద్రంగా, నౌకాశ్రయంగా ఉండేది. ఈ సరస్సు లో పడవ విహారం చాలా సరదాగా ఉంటుంది. కొంచెం ఎండగా, చల్లటి గాలి తగులుతుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. చిల్కా లో బోటింగ్, ఫిషింగ్, బర్డ్ వాచింగ్, ప్రధాన ఆకర్షణ. ప్రతి సంవత్సరం శీతాకాలంలో వేల పక్షులు చిల్కా సరస్సును సందర్శిస్తాయి. చేపలు, తాబేళ్ళు, పీతలు, రొయ్యలు, డాల్ఫిన్లు వంటి నీటి జంతువులూ చిల్కా సరస్సులో నివసిస్తాయి.
బెర్హంపూర్ బీచ్...
ఇది అతిపెద్ద పురాతన నగరాలలో ఒకటి. ఒడిషాలోని గంజం జిల్లాలో ఉంది బెర్హంపూర్ నగరం. ఇది పట్టు వస్త్రాలకు, చేనేత, నగల దుకాణాలకు ప్రసిద్ధి. కాబట్టి దీన్ని పట్టు నగరంగా కూడా పిలుస్తారు. ఇక బెర్హంపూర్ బీచ్ ప్రేమికు లతో, పర్యాటకులతో ఎప్పుడు సందడిగా ఉంటుంది. బీచ్ ఒడ్డున కూర్చొని ఇసుకతో బొమ్మరిల్లు కట్టుకోవడం, అలలతో ఆడుకోవడం మరిచిపోలేని జ్ఞాపకం.
సన్ రైజ్ హిల్స్...
భారత దేశంలో నిర్మాణ కౌశలానికి ఉదయగిరి చక్కటి ఉదాహరణ. ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డ బౌద్ధ, జైనుల పెద్ద పెద్ద నిర్మాణాలు, ఆశ్రమాలు, స్తూపాలు, శిథిలాల వల్ల దీనికి చాలా చారిత్రక ప్రాముఖ్యం ఉంది. ఒడిషా రాజధాని భువనేశ్వర్ నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఉదయగిరి. దీన్ని సన్ రైజ్ హిల్స్ అని కూడా పిలుస్తారు. ఉదయగిరిలో 18 గుహలలో విస్తారంగా చెక్కిన శిల్పాలు, నిర్మాణాలు పర్యాట కులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ దొరికిన శాసనాల ప్రకారం జైన సన్యాసుల కొండలు తొలిచి నివాసాలను ఏర్పరుచుకున్నట్టు తెలుస్తున్నది. ఉదయగిరి పక్కనే ఉన్న ఖండ గిరి అనే మరో కొండ లో 15 గుహలు ఉన్నాయి. ఉదయగిరి, ఖండగిరి రెండూ ఉద యగిరి పర్యాటకానికి కీలకమైన పట్టుకొమ్మలు.
గోపాల్పూర్ బీచ్...
ఈ ప్రదేశం బంగాళాఖాతానికి సమీపంలో ఉంది. ఇది ఒడిషా కు దక్షిణ సరిహద్దు లో ఉన్న కోస్తా పట్టణం. ఒరిషా రాష్ట్రంలోని మూడు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి గోపాల్పూర్. పూర్వం గోపాల్పూర్ ను మత్స్యకారుల గ్రామంగా పిలిచేవారు. ఇది మంచి వ్యాపార కేంద్రం. షాపింగ్ ప్రియులు ఈ పట్టణానికి ఎక్కువగా వస్తారు. గోపాల్పూర్ సముద్రపు గవ్వలతో తయారు చేసిన బ్రేస్లెట్లు, నెక్లెస్లు, పట్టుచీరల వంటి హస్తకళల కు ప్రసిద్ధి చెందింది.
అద్భుతమైన నగరం కటక్...
కటక్ లోని పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడికి భువ నేశ్వర్ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది కటక్. ఒడిషా సాంస్కృతిక, వ్యాపార నగరంగా పేరుగాంచింది. కటక్ అతి పురాతన నగరాలలో ఒకటి. కటక్ పర్యటన పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంది. అక్కడి కోటలు, కొండలు, శిల్ప సౌందర్యం అబ్బురపరుస్తాయి. కటక్కు దగ్గరలో ఉన్న ధబలేశ్వర్ బీచ్, రత్నగిరి, లలిత్గిరి, ఉదయగిరి కొండల అందాలు ఆకట్టుకుంటాయి. సత కోసియా వన్యప్రాణుల అభయారణ్యంలో వైవిధ్యమైన అడవి జంతువులను చూడవచ్చు. బారబతి స్టేడియంలో స్పోర్ట్స్ ప్రేమికులు ఎక్కువగా ఉంటారు. మన దేశ స్వాతంత్య్రం గురించి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకో వాలనుకునే వారు నేతాజీ మ్యూజి యం సందర్శించ వచ్చు.
భువనేశ్వర్...
ఒడిషా రాజధాని భువనేశ్వర్. భారతదేశం తూర్పు భాగంలో ఉన్న గంభీరమైన పట్టణం. మహానది నైరుతి ఒడ్డున ఉన్నది. ఈ నగరం కళింగ కాలం నాటి నుంచి అద్భుతమైన నిర్మాణాశైలిని కలిగి ఉన్నది.
ఈ మహానగరంలో 3000 సంవత్సరాల నాటి గొప్ప వారసత్వ సంపద దాగి ఉన్నది. భువనేశ్వర్ భూభాగంలో 2000 కంటే ఎక్కువ దేవాలయాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఆలయనగరం అని కూడా పిలుస్తారు. భువనేశ్వర్ లో పురాతన కాలం నాటి గొప్ప నిర్మాణ శైలి ఉండటం వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందింది. భువనేశ్వర్, పూరీ, కోణార్క్ ను కలిపి ''స్వర్ణ త్రిభుజ'' అని అంటారు. ముఖ్యంగా భువనేశ్వర్లో ఉండే దేవాలయాలు, సరస్సులు, గుహలు, మ్యూజియంలు, ఉద్యానవనాలు, ఆనకట్టలు, బిందిసాగర్ సరస్సు, ఉదయగిరి, ఖండగిరి, దులిగిరి, చందక వన్యప్రాణుల అభయారణ్యం, అత్రి వేడి నీటి బుగ్గ మొదలైనవి చూడదగ్గ ప్రదేశాలు. అలాగే భువనేశ్వర్లో అనేక పార్కులూ ఉన్నాయి.
- రూప
7661910634
Authorization