కర్నూలు.. పచ్చదనం తొడిగిన హారం.. కనుచూపుమేరలో పరుచుకున్న అందాలు. ప్రకృతి మధ్య ఒంపు సొంపులతో సాగిపోయే జలపాతాలు.. పక్షుల కిలకిలరావాలు. ఇలాంటి పరవశింపజేసే ప్రకృతి అందాల మధ్య వీకెండ్ని ఎంజారు చేయాలని ఉందా..? అయితే కుటుంబంతో సహా శ్రీశైలం వెళ్లడానికి ఓ సారి ప్లాన్ చేసుకోండి.
హైదరాబాద్ నుంచి 214 కిలో మీటర్లు బస్సులో వెళితే 4 గంటల ప్రయాణం దరిదాపుల్లోంచి దట్ట మైన అడవులు కనిపిస్తాయి. వెళుతున్న కొద్దీ అన్నీ అడవులే మధ్య మధ్యలో మృగాలు సంచ రిస్తున్నాయి అనే హెచ్చరింపు బోర్డులు ఉన్నాయి. పచ్చని ఆహ్లాదకర వాతావరణం, చుట్టూ కొండలు, కొండల మధ్య ప్రవహిస్తున్న కృష్ణా నది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రయాణం అందమైన జ్ఞాపకం. కొండ పైకి ఎక్కే కొద్దీ కింద కనిపించే నది ప్రవాహం చూడముచ్చటగా ఉంది.
కొండ పైకి ఎక్కినాక చాలామంది దర్శనం చేసుకుంటారు. మరికొందరు చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతారు. అక్కడి వాతావరణంలో అడవి చుట్టూ తిరిగి వస్తే బాగుండు అనిపి స్తుంది. ఇక్కడ మళ్లికార్జున స్వామి గుడి చాలా ప్రసిద్ధిగాంచిన దేవస్థానం. దట్టమైన నల్లమల్ల అడవుల మధ్య వెలసిన దేవాలయంగా దీన్ని చెబు తారు. అంతే కాదు ఇక్కడ దేవస్థానంతో పాటు చుట్టు పక్కల చూడటానికి కొన్ని స్థలాలు ఉన్నాయి. అవే పాలధారా, పంచధార, హఠకేశ్వరం, సాక్షిగణపతి, శిఖరం, శ్రీశైలం ప్రాజెక్టు, శ్రీశైలం వెళ్లినవారు తప్పని సరిగా చూడదగ్గ ప్రదేశాలివి. వీటితో పాటు మనకు ఇంకో ప్రసిద్ధిగాంచిన ప్రదేశం కూడా ఉంది. అదే అక్క మహాదేవి గుహ. శ్రీశైలం నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరం లో ఉంది. దీన్ని చూడటానికి కేవలం బోట్ లో వెళ్లాలి. పర్యాటక శాఖ వారు కేటాయించిన బోట్లో మనం ముందుగానే టిక్కెట్ తీసుకుంటే వారు స్వయంగా వచ్చి మనల్ని బోట్ వద్దకి తీసుకెళ్తారు. బోట్ దగ్గరికి వెళ్లడానికి కూడా రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి మెట్లు, రెండవది రోప్ వే, సుమారు 700 వందల మెట్లు ఉండటం వల్ల చాలా మంది రోప్ వేకే ఎక్కువ ఆసిక్తి చూపిస్తారు. ఖర్చు కూడా తక్కువగానే ఉండటం వల్ల పర్యాటకులకు ఎక్కువగా రోప్ వే నే ఎంచుకుంటారు. ఇక రోప్ వే నుంచి దిగి బోట్ లో 19 కిటోమీటర్ల వరకు గం టకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్క మహాదేవి గుహల దగ్గర గంట సేపు బోట్ను ఆపుతారు. పర్యాటక శాఖ వారు కేటాయించిన గైడ్ అక్క మహాదేవి గుహల గురించి ప్రత్యేకంగా వివరి స్తారు. ఈ గుహలకు కదలి వనం అనే పేరు కూడా ఉన్నది.
ఇంకా మరెన్నో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. ఎటు చూసిన చుట్టూ కొండలు చెట్లు ఎక్కువగా కని పిస్తాయి. ఎత్తైన కొండ ప్రాంతం కావటం వల్ల అక్కడ పర్యటన చాలా ఆనందంగా ఉంటుంది. శ్రీశైలానికి కొన్ని కిలో మీటర్ల దూరం నుంచే మనకు చాలా దట్టమైన అడవులు కనిపిస్తాయి. అక్కడక్కడ జంతువులు, పాములు, ఉన్నట్టు బోర్డులు పెడతారు. మనకు మొదట ప్రాజెక్టు కనిపిస్తుంది. బస్సులు కొండ మధ్యనుంచి పాము తిరిగినట్టు వంపులు తిరుగుతూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. శ్రీశైలం దర్శనం అనంతరం అక్కడ టూరిజం ప్యాకేజ్ వాళ్లతో మాట్లాడుకుంటే చుట్టు పక్కల ఉన్న అన్ని ప్రదేశాలు దగ్గర నుంచి చూపించి తీసుకు వస్తారు. నది దగ్గరికి వెళ్లడానికి ఆటో సదుపాయాలు కూడా ఉన్నాయి. రోప్ వే సహాయంతో మనం కృష్ణా నది దగ్గరికి వెళ్లవచ్చు. అక్కడి నుంచి బోటింగ్ సౌకర్యం, ఇంకా చిన్న చిన్న పుట్టీలు ఉంటాయి. నీటిలో ఆడాలనుకునేవారికి అనువుగా బారికేట్లను ఏర్పాటు చేశారు. అక్క మహాదేవి గుహల దగ్గరకు వెళ్ళాలంటే కేవలం లాంచిలో మాత్రమే వెళ్లగలం. శ్రీశైలం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ గుహలు ఉన్నాయి. బోటింగ్ చేస్తున్నంత సేపు దట్టమైన అడవి ప్రాంతంలో ప్రయాణం ఉంటుంది. ఫోన్ సిగల్స్ ఉండవు, ఆకాశం నుంచి మబ్బులు వచ్చి అడవులకు తాకుతున్నాయనిపిస్తుంది. నీటి మధ్యలో ప్రయాణం చాలా ఉల్లాసభరితంగా ఉంటుంది. వెళుతున్నంత సేపు హాయిగా అనిపిస్తుంది.
- అపర్ణ
Authorization