హిందూ మహాసముద్రంలో తేలియాడుతున్నట్లుండే ఆ దీవులు.. ఒకప్పుడు భరతఖండంలో అంతర్భాగాలే! లెక్కలేనన్ని దీ ఇండోనేషియా 17,000 దీవుల సముదాయం. వీటిలో పేరు తెలియని, జనసంచారం లేని దీవులే ఎక్కువ. మిగిలిన దీవుల్లో పాతిక కోట్ల మందికిపైగా జీవనం సాగిస్తున్నారు. వీరిలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారు ఎందరో. అందుకే ఈ దేశంలో ఎవరి భాష వారిది. ఎవరి సంస్కతి వారిది. 300కు పైగా భాషలు వినిపిస్తాయి. అయినా 'భిన్నత్వంలో ఏకత్వం' ఇండోనేషియా జాతీయ విధానం. అందుకే, దీవులుగా విడిపోయినా.. దేశంగా కలిసి విరాజిల్లుతున్నాయి. భాషలు వేరుగా ఉన్నా.. జాతీయభావంతో మెలుగుతున్నాయి. హిందూత్వం, బౌద్ధమతాల ప్రాభవాన్ని చూసిన ఇండోనేషియాలో ఇప్పుడు 87 శాతానికిపైగా జనాభా ముస్లింలే! ఇన్ని ప్రత్యేకతలున్న అందాల దీవులకు ట్రావెలోకంలో ఘనమైన గుర్తింపు ఉంది. ఏటికేడు ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.
వేదికలకు నిలయం : ఇండోనేషియా రాజధాని జకార్త, మరో ప్రముఖ నగరం పాలెంబ్యాంగ్ ఆసియా క్రీడలకు వేదికగా, పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. జకార్త జావా ద్వీపంలో ఉంటుంది. ఆకాశాన్నంటే భవనాలు, ఆహ్లాదపరిచే ప్రకతి అందాలు ఈ నగరం సొంతం. పార్క్లు, పబ్బులు, క్లబ్బులు అందరికీ అన్నీ ఉన్నాయిక్కడ. జకార్త నుంచి పాలెంబ్యాంగ్ సుమారు 620 కి.మీ దూరంలో ఉంటుంది. విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మన హైదరాబాద్లోనే కాదు.. పాలెంబ్యాగ్లోనూ మూసీ నది ఉంది. ఈ మూసీపై ముక్కు మూసుకోకుండా విహరించవచ్చు. జకార్త, పాలెంబ్యాంగ్లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన మైదానాలు పర్యాటకులను అబ్బురపరుస్తాయి.
బొలెడన్నీ చూడొచ్చు: అద్భుత ప్రకతి సంపత్తి కలిగిన ఇండోనేషియాలో మరెన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. సుమత్రా, జావా, న్యూగినియా, బాలీ, బాండా, టెర్నేట్ ఇలా ఎన్నెన్నో ద్వీపాలు. సముద్ర క్రీడలకు ఈ దీవులన్నీ అడ్డాలే! సర్ఫింగ్, స్కూబా డైవింగ్, బనానా రైడింగ్, స్నోర్కలింగ్ వంటి సాహస క్రీడలు పర్యాటకులకు వినోదాన్ని పంచుతాయి.
కొమొడో నేషనల్ పార్క్ : యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన ప్రదేశాలు ఇండోనేషియాలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ఫ్లోర్స్ ద్వీపంలోని కొమొడో నేషనల్ పార్క్. ఇక్కడ పది అడుగుల పొడవుండే బల్లులు ఉంటాయి. కొమొడో డ్రాగన్స్గా పేరున్న ఈ బల్లులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. డ్రాగన్స్ పార్క్ సమీపంలోని పింక్ బీచ్ తప్పకుండా సందర్శించాలి. గులాబి రంగులోని ఇసుక తిన్నెల్లో విహారం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
బాలి భలే ద్వీపం: ఇండోనేషియా అనగానే గుర్తొచ్చే పేరు బాలి. కానీ, దానిని తలదన్నే దీవులు, సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయిక్కడ. వాటిలో ఒకటి లాంబక్. ప్రకతి సిద్ధమైన అందాలకు నెలవు ఈ ప్రాంతం. బీచ్లు, జలపాతాలు, అగ్నిపర్వతాలు ఎన్నో ఉన్నాయి. లాంబక్ పరిధిలోని గిలి ద్వీపాలు హనీమూన్ స్పాట్గా పేరొందాయి. నీలాల నింగి.. నీలిరంగు సముద్ర జలాలు.. తెల్లని ఇసుక తిన్నెలు.. ఆహ్లాదకర వాతావరణం భలేగా ఉంటుంది. ఇక్కడి తీరంలో సర్ఫింగ్, స్కూబాడైవింగ్ ప్రత్యేకం. జకార్త నుంచి లాంబక్కు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడి నుంచి మర పడవల్లో కొమొడో నేషనల్ పార్క్కు చేరుకోవచ్చు.
బ్రోమో పర్వతం: ఇండోనేషియాలో మరో అందమైన దీవి జావా. ఇక్కడ ఎన్ని విశేషాలున్నా.. అందరి కళ్లూ.. బ్రోమో అగ్ని పర్వతంపైనే ఉంటాయి. తూర్పు జావా పరిధిలో సెమేరు నేషనల్ పార్క్ కొండలు, పర్వతాలతో ఉంటుంది. సెమేరు పర్వతానికి కాస్త దూరంలో పొగలు కక్కుతున్న బ్రోమో పర్వతం కనిపిస్తుంది. పర్వతాన్ని చుట్టుముట్టిన పొగలు మేఘాలను మరిపిస్తాయి. వాటి మధ్యలో బ్రోమో శిఖరాగ్రం నుంచి పొగలు వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు ఈ పర్వతంపైకి ట్రెక్కింగ్ అవకాశం ఉండేది. ప్రస్తుతం నిషేధం కొనసాగుతుంది. ఇక్కడికి సమీపంలోని పెనంజకన్ పర్వతంపై ఉన్న వ్యూ పాయింట్ నుంచి బ్రోమో దర్పాన్ని దర్శించవచ్చు. మౌంట్ బ్రోమోను బ్రహ్మ పర్వతం అని కూడా పిలుస్తారు. సెమేరు నేషనల్ పార్క్లో మరెన్నో విశేషాలు ఉన్నాయి. అందులో ఒకటి మడకరిపుర జలపాతం. నిండా పచ్చదనం ఉన్న పర్వతాల నుంచి జాలువారే జలధారలను చూస్తూ ఎంతసేపైనా ఉండిపోవచ్చు. సురబయ నుంచి సెమేరు నేషనల్ పార్క్ 110 కి.మీ దూరంలో ఉంటుంది. జకార్త, కౌలాలంపూర్, సింగపూర్ నుంచి సురబయకు విమాన సర్వీసులు ఉన్నాయి. అక్కడి నుంచి ట్యాక్సీలో వెళ్లాలి. పాలు.. లెక్కకు మిక్కిలి అగ్నిపర్వతాలతో నిండిన ఆ దేశమే.. ఇండోనేషియా! ఆనందాలకు, ఆహ్లాదాలకు, అద్భుతాలకు ఆలవాలమైన ఇండోనేషియా పర్యాటక ప్రియులను తనవైపు ఆకట్టుకుంటోంది.
Authorization