గతంలో పఠాన్ కోట్ నుండి లోహతాంగ్ కనుమ వరకు స్కూటర్ మీద సాహస యాత్ర చేసిన అమరేంద్ర యాత్ర చరిత్రను చదివి ఉన్నాను. ఈ సారి స్కూటర్పై దక్షిణ భారత దేశ యాత్ర చేయాలన్న చిరకాలపు కోరికను 2015 జనవరిలో తీర్చుకున్న విధానాన్ని ''కొన్ని కలలు ఒక స్వప్నం'' అనే యాత్రా కథనంగా తీసుకొచ్చారు. ఈ సారి స్కూటర్కు బదులుగా యాక్టివాను తీసుకొని తక్కువ లగేజీతో బయలు దేరారు. ముందుగా బెంగళూరు నుండి తూర్పు దిశలుగా ఉన్న తిరుపతి మీదుగా పాణిపాకం, అరక్కోణం, వంచిల, బంగాళాఖాతపు తీరరేఖను అంటిపెట్టుకొని ఉన్నా... మహాబలి పురం, పుదుచ్చేరి, కడతారు, చిదంబరం, వేలాంగిణి, నాగపట్నం, పూలపుహార్, కొల్కత మీదుగా వెళ్ళి, వేదారణ్యం దగ్గర ఉన్న సముద్రంలోకి చొచ్చుకు వచ్చినట్టు ఉండే కలిమెరే పాయింట్ను చూసి, ఇంకా దిగువకు వెళ్ళి రామేశ్వరం, ధనుష్కోడిలను చేరాలనీ, చివరికి భారత దేశం దక్షిణ అగ్రం కన్యా కుమారి దగ్గర తేలారు. కన్యాకుమారి దగ్గర ప్రయాణం ప్రారంభించి సముద్రాన్ని అంటి పెట్టుకొని ఉన్న త్రివేండ్రం, క్విలిన్, అలెప్పిల మీదుగా కొచ్చిన్ చేరుకున్నారు. అక్కడి నుండి మంగుళూరు చేరి తూర్పు దిక్కుకు మళ్ళి ధర్మస్థల, సల్లేస్పర, హసనల మీదుగా తిరిగి బెంగళూరు చేరుకున్నారు.
మొత్తం మూడు వేల కిలోమీటర్లు బండిని రోజుకు సగటున రెండు వందల యాభై కిలోమీటర్లు నడిపి ప్రయాణాన్ని పది పన్నెండు రోజులు సాగించాలని ప్లాన్ చేసుకున్నారు. రోజులో ఏడెనిమిది గంటలు బండి నడపడానికి, ఏడెనిమిది గంటలు ఆయా ప్రదేశాలు చూడటానికి వినియోగించారు. సాహితీ మిత్రులు, పరిచయస్తులు, బంధువులు, ఒకనాటి సహోద్యోగులు, పూర్తిగా అపరిచితులు, ఆయా ప్రాంతాలు అమరేంద్ర కలసిన మనుషులు, దక్షిణాది రాష్ట్రాలలో సంస్కృతి, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు చాలా వరకు ఒకేలా ఉంటాయి. ఊర్లు, మనుషులు తెలిసినట్టుగానే ఉంటారు. అందున అమరేంద్ర భౌతికంగా ఒంటరిగానే ప్రయాణించినా మానసికంగా మనుషులతోనూ, ప్రకృతితోనూ కలిసి ప్రయాణించారు. ఆ అనుభవాలను, జ్ఞాపకాలను అందించిన యాత్రా కథనమిది.
కొన్ని జ్ఞాపకాలు ఒక స్వప్నం.. రచన :దాసరి అమరేంద్ర, వెల:150 రూ, పే:178, ప్రతులకు :ప్రధాన పుస్తక కేంద్రాలు.
- కె.పి.అశోక్ కుమార్
Authorization