ఈ సారి మా ప్రయాణాన్ని 'ఇజ్రాయిల్' వైపు మళ్ళించాం. ఇక్కడికి వెలుతున్నామని చెప్పగానే తెలిసిన మిత్రులు, శ్రేయోభిలాషుల నుండి కొంత వ్యతిరేకత. ఎప్పుడూ యుద్ధాలతో ఉండే ఆ దేశ పర్యటన ప్రాణాల మీదకు తెస్తుందేమో చూసుకోమని చిన్న చిన్న సలహాలు... కానీ వీటికి ఏనాడు భయపడని, లెక్కచెయ్యని మేం ఆ ప్రాంతాన్ని కూడా చూడాలని ఆత్ర్రుత పడ్డామనే చెప్పాలి. మా ఆత్ర్రుతకు, ఉత్సాహానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఇజ్రాయిల్ అని పిలుస్తున్న దేశం, అక్కడున్న 'జెరుసలేం' అనబడే ప్రాంతం ప్రపంచలోని మూడు మతాల నిలయం. యూదులు, క్రైస్తవులు, అరబ్బులు ముగ్గురూ ఈ ప్రాంతాన్ని పవిత్ర భూమిగా భావిస్తారు.
మతాలకు అతీతంగా అన్నీ ప్రాంతాలను చూసే అల వాటున్న మాకు జీసస్ పుట్టిన ప్రాంతాన్ని కూడా చూడాలనే కోరిక కలిగింది. మూడు మతాల పుట్టుకకు, సంప్రదాయాలకు ప్రతీకైన ఆ ప్రాంతాన్ని చూసి, అక్కడి ప్రజల ఆచార వ్యవహా రాలను గమనించాలనే కోరిక నన్ను మమ్ముల్ని ఆ ప్రాంతానికి వెళ్ళేలా చేసింది. ఈ ప్రయాణం కొంత సాహసంతో కూడినదైనప్పటికి వెళ్ళాలనే నిర్ణయించుకొని బయలు దేరాం. అయితే ఇజ్రాయిల్కు వెళ్ళి వచ్చారని తెలిస్తే, ఇతర ముస్లిం దేశాలు వీసాలు ఇవ్వరని, ఇచ్చినా చాలా ఇబ్బం దులు ఎదుర్కొవాల్సి వస్తుందని విన్నాం. అందుకనీ ప్యాకేజి టూర్లో వెళ్తామని అనుకున్నాం. ఇలా వెళ్ళడం వల్ల వీసాకు బదులుగా ఒక కాగితం ఇస్తారు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసి రావచ్చని ప్యాకేజ్ టూర్కే ఒకే చేశాం. పైగా ఇలా వెళ్ళడం వల్ల ఇజ్రాయిల్తో పాటుగా పాలస్తీనా, జోర్డాన్, ఈజిప్టులను కూడా తక్కువ ఖర్చుతోనే చూడవచ్చని ప్లాన్ చేసుకున్నాం. ఈ నాలుగు దేశాలను తిరిగి రావడానికి 70 వేలు మాత్రమే ఖర్చు అయ్యింది. 15 రోజులు పట్టే ఈ టూర్ లో రవాణా సౌకర్యంతోపాటూ భోజనం, వసతితో కూడా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఇదే బెస్ట్ ఆఫ్షన్ అని ఒకే చేశాం.
ఇజ్రాయిల్లో అడుగుపెట్టాలంటే ఈజిప్టు సరిహద్దు లను దాటుకొని వెళ్ళాలి కాబట్టి మొదటి ఆ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను చూస్తూ ప్రయాణించాం. వాస్తవానికి మేం ప్రయాణించిన ఈ నాలుగు దేశాలు ఇవాళ వేరు వేరుగా ఉన్నప్పటికీ ఒకనాడు ఈ నాలుగు ప్రాంతాల ప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలు, మత విశ్వాసాలు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. మేం వెళ్లే మార్గమంతా ఎడారి ప్రాంతం, కొండలు, గుట్టల మయం. ఉదయం ఎనిమిది గంటలకు ఇజ్రాయిల్ బార్డర్ చేరుకున్నాం. మాకు ఈ బోర్డర్ దాటటానికి 20 నిమిషాలు పట్టింది. అక్కడ వారి యుద్ధ సైనిక భద్రతలు చూసి ఎంతో ఆశ్చర్యపోయాం. ఏదైనా బస్, బండ్లు గానీ వస్తే చాలు చెకింగ్ చేసి పంపుతారు. వారికి అనుమానం వస్తే ఆ బస్కు వున్న టైర్లకు గాలిని తీసేటట్టు కింద పైపులకు ముళ్ళ లాంటి ఇనుప స్థంబాలు అమర్చి ఉంచారు. వారికి అను మానం వచ్చినపుడు ఈ ఇనుప స్థంబాల్ని రివర్స్ చేస్తారట వెంటనే ఆ ముల్లులన్నీ భూమిపైకి వచ్చి టైర్లలో గాలి పోయి ఆ బస్ కదలకుండా చేస్తుంది. వెంటనే అప్రమత్తమైన సరిహద్దు సైనికులు షూట్ చేస్తారు. ఇంతటి మహా భద్రతా దళాల మధ్య నుండి మేం ఆ బార్డరు దాటాం. ఎన్నో దేశాల సరిహద్దులు తిరిగాను, వాటిగుండా ఇంకో ప్రాంతానికి వెళ్ళాం కానీ ఇలాంటిదాన్ని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు.
చే గువేరా బొమ్మ కూడా భయపెడుతుంది..!
ఇక్కడ జరిగిన ఇంకో సంఘటన చెప్పాలి. ఆ బార్డర్ దాటాక మరి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇమ్మిగ్రేషన్ మొదలయ్యింది. మా సూట్ కేసులు తీసుకొని మేం మోస్తూ ఆఫీస్కు వెళ్ళాం. ట్రాలీలు లేవు అక్కడ. 40 మందిని చాలా క్షుణ్ణంగా పరీక్షించి పంపించారు కానీ ఎందుకో మా వారిని మాత్రం పంపలేదు. కాసేపు నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆయన్ని పదే పదే మళ్ళీ క్షుణ్ణంగా పరీక్షించి, ఆయన పాస్పోర్టుని మళ్ళీ చెక్ చేసి చివరకు పంపారు. నా బుర్రలో ఎన్నో ఆలోచనలు ఎందుకు మా ఆయన్ని పదే పదే చెక్ చేశారు అని..? బాగా ఆలోచిస్తే కానీ అర్థం కాలేదు. మా ఆయన ఆ రోజు 'చేగువేరా' బొమ్మ ఉన్న టీ షర్ట్ వేసుకున్నారు. చే గువేరా ఉన్న టీషర్ట్ వేసుకున్నందుకు అనుమానం వచ్చి క్షుణ్ణంగా చెక్ చేశారని అర్థమయ్యింది. మేం వెళుతున్నది ఇజ్రాయిల్లోకి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ దేశం ఏర్పాటులో అమెరికా కీలక పాత్రను పోషించిందని. పాలస్తీనాను అక్రమించి ఇజ్రాయిల్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి అమెరికా పొరుగున్న ఉన్న క్యూబా తీవ్రంగా వ్యతిరేకించింది. క్యూబా దేశ హీరోనే ఈ చేగువేరా. ఆయన ఐక్యరాజ్య సమితీలో కూడా ఈ ఇజ్రాయిల్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ, పాలస్తీనాకు మద్దతు ప్రకటించాడు.
ఎడారిలో బిందు సేద్యం...
ఇదే విషయాన్ని మా ఆయనతో చెబితే 'అయ్యో ముందే చెప్తే తీసే సేవాడిని కదా' అన్నారు. నేనన్నాను కాదండీ మిమ్మల్ని ఆపినందుకు కారణాలు ఏమై ఉంటాయని ఆలోచిస్తే ఈ కారణం దొరికింది అన్నాను. మొత్తానికి బార్డర్ దాటాం. మా కోసం ఇజ్రా యిల్ బార్డర్లో బస్ వెయిట్ చేస్తుంది. ఆ బస్సులో కూర్చొ ని పరిసరాలను చూస్తూ సాయంత్రం ఆరుగంటలకు బయల్దేరి 11 గంటలకు చేరాం. అయితే ఈ మార్గం వెంటనే ఆ కొండలు గుట్టలు మట్టి ఎడారి గుండా ఒక్కసారే పచ్చటి పొలాల మధ్యన పోతున్నాం. ఔరా! అని మళ్ళీ బుగ్గన వేలేసుకు న్నాను. ఎంత ఆశ్చర్యం. ఈ ఎడారులలో కూడ పచ్చటి పంటలు ఎలా పండిస్తున్నారు అని.! ఏడారిలో దొరికే ఒక్కొక్క బొట్టు నీటిని ఒడిసి పట్టుకొని అది వేస్ట్ కాకుండ ప్రతి చెట్టుకి వేర్లు తడిసేలా నీటిని సరఫరా చేస్తున్నారు. దీన్నే 'డ్రిప్ ఇరిగేషన్' అని అంటారు. మన భాషలో మనం 'బిందు సేద్యం' లేదా కారు సేద్యం, లేదా 'సూక్ష్మ సేద్యం' అని పిలుస్తాం. మొక్కల కాండా లకు కవాటాలు, గొట్టాలు, నాళికలు నెట్ వర్క్ ద్వారా నీరు బొట్లు బొట్లుగా కారేలా చేసి నీటిని, ఎరువులని ఆదా చేసే పద్దతి ఇది. ఇజ్రాయిల్లో కనుగొనబడిన ఈ సేద్యపు పద్ధతి క్రమేపీ ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలకు కూడా విస్త రించింది. ఏడారిలో సహితం పంటలు పండిచే మానవుడి తెలివితేటలకు అబ్బురపడుతూ ముందుకు సాగాం.
ఓలివ కొండ...
తర్వాత రోజు ఓలివ కొండకు వెళ్ళాం. ఇది జెరూషలేము తూర్పున ఉన్న సరిహద్దు ప్రాంతం. ఇది జెరూషలేము పాత నగరం. ఇక్కడ యూదుల సమాధులు చాలా వున్నాయి. ఇందులో దాదాపు 1,50,000 సమాధులు వున్నాయట. ఆర్థోడాక్స్, క్యాథలిక్స్, ప్రొటెస్టంట్స్ ఈ ప్రదేశానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. ఇన్ని సమాధులను చూసి ఆశ్చర్య పొయ్యాను. ఈ సమాధులన్నిటిని చూసి అమ్మో అంటే మాగైడ్ అన్నారు దీనిని (కంట్రీ ఆఫ్ గ్రీవ్యార్డ్) అని కూడా అంటారని చెప్పారు.
'ది లాస్ట్ సప్పర్'...
అక్కడి నుండి మేం జీసస్ ఆఖరి విందు భోజనం చేసిన స్థలానికి వెళ్ళాం. జీసస్ తన శిష్యులతో కలిసి చివరిసారి భోజనం చేసింది ఇక్కడే. 'ది లాస్ట్ సప్పర్' అనే పేరుతో ఇది ప్రసిద్ధి కెక్కింది. 15వ శతాబ్దానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ అర్టిస్ట్ లియోనార్డో డావిన్సీ గీసిన 'ది లాస్ట్ సప్పర్' అనే పెయింటింగ్ జీసస్ చేసిన ఈ చివరి భోజనం సంబంధించిన అంశాన్ని తీసుకొని గీసిందే. అటు వంటి చారిత్రాత్మక పెయిం టింగ్స్ను చూడటం ఇదే మొదటి సారి. దీనికి పక్కనే ఆలివ్ తోట వుంది. తోట చాలా అందంగా ఉంది. తర్వాత మేం హెరోద్ మహారాజు బంధించిన గృహంలోకి వెళ్ళాం. అది మూడు అంతస్థుల మేడ పైన గుండ్రని బావిలాగ ముఖ ద్వారం వుంది. ఆ మూడంతస్థులు చూసి ఫొటోలు దిగివచ్చాం. తర్వాత 14 స్థలాలున్న వెరోనిక స్థంభాన్ని చూశాం. ఈ ప్రాంతానికి దగ్గరలోనే ముస్లింలకు చెందిన ఒక పవిత్ర స్థలం ఉంది. దాన్నే వీపింగ్ వాల్ అంటారు. అందు కని దీనినే వెస్ట్రన్ సరిహద్దులంటారు. క్రిస్టియన్స్, క్యాథలిక్స్, యూదులకు కూడా ఇది ఆరాధ్య స్థలం. ఆ ప్రాంగణంలో 20 మంది అబ్బాయిలు ఒక ఇనుప వైర్ కట్టి దానిని 20 మంది గట్టిగా పట్టుకుంటే ఆ వైర్ మీద ఒక అబ్బాయి నడుస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు. అలా అందరి తలలను పట్టుకుంటూ మొత్తం ఒక రౌండు తిరిగాడు. అదొక వినోదం. అక్కడ గమనించింది పాత కాలంనాటి ఇటుకలలాగ బండలు అవి ఎగుడు దిగుడుగా వున్నాయి. కాళ్లకు షూస్ తీసుకొని నడి చినా కష్టమనిపించదు. అక్కడ నుండి వస్తూ వుంటూ ఎంతో మంది సైనికులు పహారా కాస్తున్నారు. ఎందుకంటే ఈ స్థలం లో ఎప్పుడూ ముస్లింలకు, యూదులకు గొడవలు జరు గుతూ వుంటాయట. అందుకని చాలా బందోబస్తు ఏర్పాటు చేశారు.
సాల్మన్ కోనేరులు ....
రాజు కట్టిన కోనేరులను చూడడానికి వెళ్ళాం. ఇది పాలస్తీనాకు పశ్చిమాన బెత్లెహేమ్కు ఐదు కి.మీ. దూరంలో వుంది. ఆ కాలంలో నీరుని రిజర్వాయరులాగ కట్టి అందరికి నీరు అందేటట్టు చేశాడు. ఈ ప్రాంతంలోనే క్రీ.పూ. 100 సంవత్సరాల కిందట కట్టిన అనేక ప్రాచీన కట్టడాలు కనిపిం చాయి. ఇక్కడే సాల్మన్ రాజు తన భార్యలు స్నానం చేయడానికి కట్టిన కోనేరులు ఉన్నాయి. వాటిని చూస్తూ అప్పటి టెక్నాలజీకి అబ్బురపడిపోయాను.
హెర్మోన్ పర్వతం ...
అక్కడి నుండి మేం హెర్మోన్ అనే స్థలానికి వెళ్ళాం. అక్కడ అన్నీ గృహాలు, ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉన్న ఇండ్లు. కేబుల్ కారులో ఆ ఇండ్లన్నీ చూశాం. ఇక్కడ ''వైట్ బాక్ క్లిఫ్ వేస్'' చూసి ఆనందించాం. ఇది 1940 మీటర్ల పొడవైన కేబుల్ కారు. అక్కడి పచ్చని పొలాలు చాలా అద్భుతంగా వున్నాయి.
మృతసముద్రం...
ఇజ్రాయిల్ దేశాల మధ్యన గల ఉప్పునీటి సముద్రం ఇది. ఇది సముద్ర మట్టానికి 420 మీటర్ల దిగువన ఉన్నది. ఇది 380 మీటర్ల లోతుతో ప్రపచంలోనే అత్యంత లోతైన ఉప్పునీటి సరస్సు. దీంట్లో 33.7 శాతం లవణీయత
ఉండటంతో ప్రపంచంలోనే అత్యంత ఉప్పుగా ఉండే జలాశ యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ లవణీయత వల్ల మృత సముద్రం జంతుజాలం మనుగడకు అత్యంత కఠోరమైన ఆవరణంగా మారింది. ఈజిప్టు ప్రజలు మమ్మీలను భద్రపరచడానికి ఉపయోగించిన లేపనాల నుండి ఎరువులలో వాడే పొటాష్ వరకూ అనేక రకాల ఉత్పత్తులను మృత సముద్రం సరఫరా చేసింది. మృత సముద్రం నుండి లభించే లవణాలు, ఖనిజాలు సౌందర్య సాధనాలు తయారు చేయటానికి ప్రజలు ఉపయోగించేవారు.
మిలటరీ దుస్తుల్లో యువత...
ఈ ప్రాంతాలన్ని తిరుగుతూ ఉంటే మాకు కనిపించిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ చాలా మంది యువతీ, యువకులు రైఫిల్స్ పట్టుకొని తిరుగుతున్నారు. వారు పోలీస్ డ్రెస్ వేసుకొని వున్నారు. ఎందుకు ఇంత మంది ఎక్కడ పడితే అక్కడ వున్నారు అని ఆలోచిస్తూ లోకల్ బస్ ఎక్కి కూర్చున్నాను. మేం ఎక్కిన బస్సు ఒక స్టేజ్ దాటామో లేదో అక్కడ ఒక అమ్మాయి గన్ పట్టుకొని బస్సు ఎక్కి కూర్చుంది. నాలో ఉన్న అనుమానాన్ని తీర్చుకుందామని వెళ్ళి అమ్మాయి పక్కకి వెళ్ళి కూర్చుని ఈ దేశంలో అందరికీ గన్స్ ఇస్తారా అని నాలో ఉన్న ప్రశ్నను ఆమె ముందు ఉంచాను. ఆ అమ్మాయి ఇచ్చిన సమాధానం ఒక్క నిమిషం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇజ్రాయిల్ దేశంలోని ప్రతి అమ్మాయి, అబ్బాయి 18-19 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్లు కచ్చితంగా యుద్ధ నైపుణ్యాలు నేర్చుకోవాలట. ఒక రెండు సంవత్సరాల పాటు నేర్చుకిని దేశానికి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రతివారికి ఇలా ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పింది.
- నర్మదా రెడ్డి
9849018510
Authorization