పర్యటనతో వినోదమే కాదు విజ్ఞానమూ కలుగుతుంది. భారతీయులు పర్యాటకం మీద మునుపటి కన్నా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కుటుంబంతో కలిసి కొత్త ప్రదేశాలకు షికారు వెళ్తున్నారు. నూతన సాంకేతికత, పర్యాటక ఏజెన్సీలు, పర్యాటక సంస్థల వెబ్సైట్లు, పర్యాటక రంగం అందిస్తున్న రాయితీలు, సౌలభ్యాలు సందర్శకులను పర్యటనల వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి.
ఆన్లైన్ వెబ్సైట్లు: పర్యాటక సంస్థలు ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. పర్యటించాలను కుంటున్న ప్రదేశం వివరాలు, అక్కడ వసతి, భోజనం, వినోదం, షాపింగ్కు ఎంత ఖర్చు చేయాల్సివస్తుంది తదితర వివరాల కోసం ప్రజలు పలు ట్రావెల్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు.
పర్యాటక శాఖల వెబ్సెట్లు: పలు రాష్ట్రాల పర్యాటక శాఖలు, పలు ట్రావెల్ కంపెనీలు సొంత వెబ్సైట్ల ద్వారా, మొబైల్ యాప్ల ద్వారా సందర్శకులకు చేరువవుతున్నాయి. ఎక్కువ రాయితీలతో పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఇష్టమైన గమ్యాలకు వెళ్లే అవకాశాలు పెరగడంతో సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు.
డేటా ఆధారంగా: పర్యాటక ప్రదేశాల డిజిటలైజేషన్ వల్ల పర్యాటక స్థలాల వివరాలు, హౌటళ్లు, ట్రావెలింగ్ సంస్థల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి.
బడ్జెట్లోనే యాత్ర: పర్యాటకుల కోసం ప్రత్యేకంగా హోటల్స్తో పాటు షేరింగ్ హాస్టల్స్ ఏర్పాటవుతున్నాయి. అనువైన బడ్జెట్లోనే మనసుకు నచ్చిన ప్రదేశాలను చుట్టి వచ్చే అవకాశాలు పెరిగాయి.
వీసా ఆన్ ఆరైవల్: విదేశీ పర్యాటకులు భారత్ రాగానే వారికి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో భారత్లో పర్యటించడానికి ఎక్కువ మంది విదేశీయులు ఆసక్తి చూపుతున్నారు. కొత్త ప్రదేశాలంటే ఆసక్తి: ఇంతవరకు చూడని ప్రదేశాలకు వెళ్లి, అక్కడి సంస్కతి, సంప్రదాయాలు తెలుసుకునేందుకు భారతీయ యువత ఆసక్తి చూపుతున్నారు. చాలామంది ఒంటరిగా యాత్రలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు.
Authorization