ఏడాదికి ఒకసారి మానసిక ప్రశాంతత కోసం ప్రయాణాలు చేసేవారు చాలామంది ఉంటారు. అది ఒంటరిగా కావొచ్చు, కుటుంబంతో కావొచ్చు. అయితే ఈ ఏడాది మాత్రం ఇంచుమించు ఐదు కోట్ల మంది భారతీయులు విదేశాలను చుట్టేస్తారని 'ప్రపంచ పర్యాటక సంస్థ' అంచనా వేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్... లాంటి దేశాలు వారి జాబితాలో కచ్చితంగా ఉంటాయి. కానీ రొటీన్కి భిన్నంగా నూతన సంవత్సరంలో ఎక్కువ మంది వెళ్లాలనుకుంటున్న కొన్ని దేశాలు...
అందాలకు నెలవు : టర్కీ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఆ దేశ రాజధాని ఇస్తాంబుల్. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అనేక సినిమాల్లో ఈ నగర అందాలు కనువిందు చేశాయి. అంతెందుకు రెండేళ్ల క్రితం వచ్చిన బాండ్ చిత్రం 'స్కైఫాల్' ఓపెనింగ్ సన్నివేశంలోనూ కనిపిస్తుందీ నగరం. ముఖ్యంగా 'పాముక్కలే' అనే పల్లె అయితే టూరిస్టులకు తెగ ఇష్టం. అక్కడ మీకు ('థర్మల్ పూల్స్' 'వేడి నీటి సరస్సులు) దర్శనమిస్తాయి. కొన్ని వేల ఏళ్ల క్రితం ఆ దేశాన్ని పాలించిన రోమన్ల కాలం నుంచీ ఈ 'పాముక్కలే' సహజసిద్ధమైన స్పాగా ప్రసిద్ధి. ఈ పల్లెకు సమీపంలో ఉన్న 'హీరాపోలిస్' అనే నగరానికి చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం ఉంది. అందుకే హీరాపొలిస్- పాముక్కలే' లను యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అందుకే 'చర్చ్ ఆఫ్ హౌలీ విజ్డమ్'గా పేరొందిన 'హేగియా సోఫియా' మ్యూజియం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. దీన్ని నిర్మాణం క్రైస్తవం- ఇస్లాం సంస్కృతులను ప్రతిబింబించేలా ఉంటుంది.
మండే చల్లని దీవి : అడవుల్లేని దేశం అది. ఏడాదంతా మంచు పరుచుకొని ఉంటుంది. వందలకు పైగా అగ్నిపర్వతాలను తనలో దాచుకొన్న విశిష్టత దీని సొంతం. అందుకే ప్రపంచంలోని అనేకమంది సందర్శకులు చూడటానికి పోటీ పడతారు. ఈ దేశం పేరు ఐస్ల్యాండ్. ఇదొక దీవి. దీన్ని ల్యాండ్ ఆఫ్ ఫైర్, ఐస్గా అభివర్ణిస్తారు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్న ఈ దేశానికి పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. ప్రతి నాలుగేళ్లకొకసారి బద్దలయ్యే అగ్నిపర్వతాలు నిప్పులు చిమ్ముతూ ఉంటాయి. ఆ భయానక వాతావరణంలో కూడా హెలిక్యాప్టర్లో చక్కర్లు కొడుతూ వీక్షించవచ్చు. మరికొంత మంది ఆ అగ్నిపర్వతాల సమీపం వరకూ వెళ్లడానికి కూడా ఉత్సాహం చూపుతారు.
చరిత్రకు సాక్ష్యం : పర్యాటకానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే మిడిల్ ఈస్ట్ దేశాల్లో సిప్రస్ ఒకటి. టర్కీకి దక్షిణ దిక్కులో, చుట్టూ మధ్యధరా సముద్రాన్ని చుట్టుకొని ఉన్న ఈ దేశం పర్యాటకం మీద ఆధారపడింది. ఇక ఈ దేశాన్ని చూడాలంటే వేసవి సెలవులే ఉత్తమం! ముఖ్యంగా అక్కడి అందమైన సాగరతీరాలే పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సిప్రస్ దేశానికి కేంద్ర బిందువుగా ఉన్న ఒక చారిత్రక నగరాన్ని కచ్చితంగా చూడాల్సిందే. దీని పేరు 'న్యూ పఫోస్'. క్రీస్తు పూర్వం 58వ సంవత్సరంలో రోమన్లు ఈ ప్రాంతాన్ని తమ ఆర్థిక రాజధానిగా చేసుకొని పాలించారు. రాజుల సమాధుల కోసం ప్రత్యేకంగా మరో నగరాన్ని నిర్మించారు. దీని పేరు 'టోంబ్స్ ఆఫ్ కింగ్స్'. ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలల్లో ఈ దేశం పర్యాటకానికి అనువుగా ఉంటుంది.
ఘన వారసత్వం: దక్షిణ కొరియా... రొటీన్ ట్రావెలర్స్కు కాకుండా కాస్త కొత్తదనం కోరుకునే వారికి ఈ దేశం సరికొత్త అను భూతినిస్తుంది. తరతరాల చారిత్రక వారసత్వాన్ని తనలో ఇముడ్చుకున్న దేశం అది. ప్రకృతి అద్భుతాలకు చిరునామాగా నిలిచిన ఈ దేశంలో ఓ క్వారీ ఉంది. ఏ దేశంలోనైనా క్వారీ అంటే కాలుష్యానికి మారుపేరులా ఉంటుంది.
Authorization