ఎంతో అద్భుతమైన హిమాలయాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతం ఎప్పుడూ పర్యాటకులతో నిండి వుంటుంది. చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ హిమాలయ అందాలను వీక్షించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వేసవి కాలంలో దక్షిణ భారతీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళతారు.
వేసవిలో వుండే వేడిని తట్టుకోలేక హిమాలయాలకు చుట్టు పక్కల వుండే వివిధ ప్రాంతాలకు సందర్శించి అక్కడి చల్లదనాన్ని ఆస్వాదిస్తారు పర్యాటకులు. హిమాలయా చుట్టూ వివిధ ప్రాంతాలు అనేక రకాలుగా అభివృద్ధి చెంది వున్నాయి. కొన్ని ప్రాంతాలయితే హిందూ ధర్మాలప్రకారం ఏర్పడ్డాయని కూడా కొన్ని కథనాలు. అందులో ఎంతో ప్రముఖంగా విశిష్టత పేరుగల ప్రాంతం నైనిటాల్. ఈ ప్రాంతం నలువైపులా సరస్సులతో నిండి, పచ్చని వాతావరణాన్ని వెదజల్లుతూ, తన అందాలతో పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటుంది.
సరస్సులకు నిలయం
నైనిటాల్... ఇది భారతదేశపు సరస్సుల జిల్లాగా పిలువబడే హిమాలయ శ్రేణి. ఇది కుమావోన్ హిల్స్ మధ్యభాగంలో అందమైన సరస్సులతో నిండి వుంది. నైనిటాల్ కు సంబంధించి పురాణాలలో వుండే మానసఖండ్ కథనం ప్రకారం దీనిని ముగ్గురు ఋషుల సరస్సు లేదా సరోవరం అని పిలుచుకుంటారు. ఈ ముగ్గురు ఋషులు తమ దాహాన్ని తీర్చుకోవడానికి ఓ ప్రాంతం వద్ద ఆగారు. ఆ ప్రాంతంలో వారు ఎంత వెదికినా నీరు దొరక్కపోవడంతో వారు ఒక పెద్ద గొయ్యిని తవ్వారు. దానిలోకి మానస సరోవరం నీటిని నింపి వారు దాహాన్ని తీర్చుకున్నారు. దీంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఇంకో కథనం ప్రకారం... పూర్వం శివుడి భార్య అయిన సతి ఎడమ కన్ను ఈ ప్రాంతంలో పడి అది నైని సరస్సుగా సృష్టించబడిందని రాసి వుంది. ఇలా ఎన్నోరకాల కథనాలు చెప్పబడి వున్నాయి. పురాణాల సంగతి ఎలా ఉన్నా పర్యాకులకు ఓ అందమైన అనుభూతిని పంచడంలో నైనిటాల్ పాత్ర ఎంతో ఉంది. ఈ ప్రాంతంలో వుండే కళలు, అక్కడి వాతావరణానికి పర్యాటకులు ఎంతో ఆకర్షితులవుతారు.
ఆకర్షణీయ కళలు...
- 1839వ సంవత్సరంలో... అంటే బ్రిటీష్ కాలంలో ఒక బ్రిటీష్ వ్యాపారవేత్త ఈ ప్రాంతం అందాలకు ముగ్ధుడై ఇక్కడ ఓ బ్రిటీష్ కాలనీని స్థాపించాడు. దాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. ఈ ప్రాంతం టూరిస్టులకు ఒక స్వర్గవిహారంలా ఎంతో అందంగా ఆకర్షిస్తుంటుంది.
- ఈ ప్రాంతంలో వుండే లాండ్స్ ఎండ్ ప్రదేశంలోని ఖుర్బతాల్ లేక్.. తన అందమైన దృశ్యాలతో ప్రయాణికులకు ముగ్ధులను చేస్తుంది. ఇది నైనిటాల్ చుట్టూ వుండే కొండల మధ్య పచ్చటి వాతావరణంతో తన అందాలను చూపుతుంది. ఇది ఎంతో ఆహ్లాదకరంగా వుండే ప్రదేశం.
- నైనిటాల్ లో వుండే నైనా శిఖరం ఎంతో ఎత్తైన శిఖరం. స్నో వ్యూ నుండి హిమాలయాల అందాలు ఎంతో అద్భుతంగా కనబడుతాయి. ఇది సముద్రమట్టానికి 2611 మీటర్ల ఎత్తులో వుంటుంది.
- నైనిటాల్ లో వుండే హిల్ స్టేషన్ ఎంతో అందమైనది. వీక్షకులు దీనిని చూడటానికి ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి విచ్చేస్తారు. అలాగే ఖుర్బాల్ తాల్ అనే ప్రదేశం ఈ ప్రాంతంలో దూర దృశ్యం. ఇది సందర్శించడానికి ఎంతో ఆహ్లాకరంగా వుంటుంది.
- నైనిటాల్ లో వుండే సరస్సులు పచ్చని వాతావరణంతో నిండి వుంటాయి. ఇక్కడి సరస్సులో వుండే బోటు విహారం ఎంతో అందంగా వుంటుంది. చివరకు అక్కడ వున్న బోట్లు కూడా పచ్చగా, పరిసరాలు పచ్చదనంతో అనేక రంగుల్లో కనువిందు చేస్తుంటాయి.
- నైనిటాల్కు 10 కిలోమీటర్ల దూరంలో పిక్నిక్ ప్రదేశం వుంటుంది. ఇది కూడా చూడదగిన ప్రాంతం. ఇక్కడున్న ఓక్, పైన్, రోడోడెండ్రాన్ వంటి అడవులు ఎంతో విశ్రాంతిని కలిగిస్తాయి.
- ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో అందమైన ప్రదేశం నైనా టెంపుల్. ఈ టెంపుల్ ను సందర్శించడానికి అన్యమతాలవారు, జాతులవారు వస్తారు. దీని చుట్టూ వుండే పచ్చని చెట్లతో ఆకర్షణీయమైన ఒక అందమైన గార్డెన్ వుంటుంది. పర్యాటకులు కొద్దిసేపు సేద తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు.
- ఈ ప్రాంతంలో రాజ్ భవన్, జూ పార్క్, ది ఫ్లట్ట్స్, ది మాల్, సెయింట్ జాన్ ఇన్ ది విల్దెర్నెస్స్ చర్చి, పాన్గోట్ లు ఇతర ప్రధాన ఆకర్షణలు.
Authorization