ఒరిస్సా రాష్ట్రంలోని మూడు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో 'గోపాల్పూర్' ఒకటి. ఇది ఒరిస్సాలోని దక్షిణ సరిహద్దులైన్లపై వున్న ఒక కోస్తా పట్టణం. ఇది బంగాళఖాతానికి చాలా సమీపంలో వుండడంవల్ల ఎంతో ప్రసిద్ధి చెందింది. కాలంతో పని లేకుండా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని ఎల్లప్పుడూ సందర్శిస్తూ ఉంటారు.
- ఒకప్పుడు ఈ ప్రాంతం సముద్రతీరంలో వుంది గనుక మత్స్యకారుల ప్రదేశంగా పిలువబడేది. అయితే బ్రిటీష్ వారు అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఆక్రమించి, వర్తకవ్యాపార కేంద్రంగా మార్చేసుకున్నారు. అప్పటినుంచి ఇది రేవుపట్టణంగా పిలవబడుతోంది.
- ఈ ప్రదేశంలో ఆకర్షణీయమైన ఇతర ప్రాంతాలు కూడా చాలా వున్నాయి. మాతారా తరిణి హిల్ మందిరం, బాలాకుమారి ఆలయం, శ్రీశ్రీశ్రీ సిద్ధివినాయక పీఠంతోపాటు ఎంతో ఆధ్యాత్మికమైన, ధార్మిక ప్రదేశాలు ఇక్కడ చూడటానికి ఆకర్షణీయంగా వుంటాయి.
- అంతేకాదు... సోనెపూర్ బీచ్, అర్యపల్లి బీచ్, గోపాల్పూర్ బీచ్ వంటి ప్రాంతాలను సందర్శించడానికి వేలాదిమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అందువల్ల దీనిని ఓ స్వర్గవిహార ప్రదేశం అంటారు. గోపాల్పూర్ ప్రాంతం సాధారణంగా సంవత్సరం పొడవునా సందర్శించడానికి చాలా ఆహ్లాదకరంగానే వుంటుంది. అయితే చాలామంది అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్యలోనే పర్యటించేందుకు మక్కువ చూపిస్తారు.
- గోపాల్పూర్ ప్రాంతంలో షాపింగ్ చేయడానికి చాలా షాపింగ్ మాల్స్ వుంటాయి. పిల్లలకు కావల్సిన ఆటబొమ్మల నుంచి ఆడవాళ్లకు అవసరమైన పట్టుచీరలు, ఆభరణాలవరకు అనేక రకాలు తక్కువ ధరలకే దొరుకుతాయి. కాబట్టి ఇటువంటి ప్రాంతాన్ని జీవితంలో ఒక్కసారైనా పర్యటించాలని అందరూ ఆసక్తిగా వుంటారు.
Authorization